హింసా ఘటనలను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం


నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్‌లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరగడాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తీవ్రంగా పరిగణించారు. తెనాలి, మాచర్ల, అనంతపురంలో జరిగిన సంఘటలకు బాధ్యులైన వారిని వెంటనే గృహనిర్బంధం చేయటంతో పాటు వారిపై కేసులు పెట్టాలని ఆయా జిల్లాల ఎన్నికల, పోలీస్ యంత్రాంగాలను ఆదేశించారు. పుంగనూరులో జరిగిన సంఘటనలో నిందితులను వదిలేసిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. సాయంత్రం 4 - 6 గంటల మధ్య ఎట్టువంటి సంఘటనలు జరిగినా అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

Read More
Next Story