అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మొరాయించిన... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..
x


అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మొరాయించిన ఈవీఎం


చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్లో ఉన్న 103 వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పని చేయడం లేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పనిచేయక పోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. పొద్దున 7 లకే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకున్నప్పటికీ నిరీక్షణ తప్పడం లేదని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అర్థగంట సేపు మాత్రమే ఈవీఎం పని చేసిందని, అనంతరం ఈవీఎం మోరాయించ డంతో గంటన్నర నుంచి నిరీక్షిస్తున్నట్లు ఓటర్లు తెలిపారు.

Read More
Next Story