Tirumala || ఉద్యోగుల భద్రతపై టీటీడీ ప్రాధాన్యం..!

ప్రమాదాల నుంచి కాపాడాలని 2000 మంది టీటీడీ ఉద్యోగులకు హెల్మెట్లు పంపిణీ చేశారు.;

Update: 2025-06-26 09:49 GMT

శ్రీవారి యాత్రికుల సేవలో ఉన్న ఉద్యోగులను ప్రమాదాల నుంచి కాపాడాలని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. టీటీడీ ఉద్య్యోగులకు చైర్మన్ బీఆర్. నాయుడు గురువారం సీవీఎస్వో మురళీకృష్ణ తో కలిసి ప్రత్యేకంగా హెల్మెట్లు అందించారు.


తిరుమలలో పనిచేసే ఉద్యోగుల్లో చాలా మంది తిరుపతి నుంచి ద్విచక్ర వాహనాల్లో రాకపోకలు సాగిస్తుంటారు. దీనికోసం రెండో ఘాట్ రోడ్డులో తిరుమలకు చేరుకునే సిబ్బంది, తిరుగుప్రయాణంలో కూడా మొదటి ఘాట్ రోడ్డులో రాకపోకలు సాగించాలి. ఈ ఘాట్ రోడ్లలో ప్రయాణించే సమయంలో ప్రమాదాలకు గురికాకుండా టీటీడీ ప్రత్యక శ్రద్ధ తీసుకుంది. ప్రతి ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ ధరించాలనే నిబంధన అమలు చేయడానికి చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే 500 మందికి మొదటి విడతగా టీటీడీ చైర్మన్ బీఆర్ .నాయుడు హెల్మెట్లు అందించారు.


భద్రత ముఖ్యం. 

ఉద్యోగుల భద్రతను  ఉంచుకుని హెల్మెట్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు మీడియాకు చెప్పారు. ఇటీవల 500 హెల్మెట్లు పంపిణీ చేశామని చెప్పారు. అమాలాపురానికి చెందిన నిమ్మకాయల సత్యనారాయణ, హైదరాబాద్ కు చెందిన నాగేంద్ర ప్రసాద్ అనే దాతలు విరాళంగా ఇచ్చిన రెండు వేల హెల్మెట్లు ప్రస్తుతం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో మరో 7500 హెల్మెట్లు టీటీడీ ఉద్యోగులకు అందిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్లు ధరించాలని ఆయన కోరారు.
టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులకు అందిస్తున్న హెల్మెట్లు ధరించి ప్రయాణం చేయడం వల్ల ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడుకోవచ్చని చెప్పారు. హెల్మెట్లు ధరించడంపై అలిపిరి, ఘాట్ రోడ్ల వద్ద ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నామని తెలిపారు. సురక్షిత ప్రయాణం కోసం తిరుమలకు వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని కోరారు. డిప్యూటీ ఈవో రాజేంద్ర, వీజీవో సదాలక్ష్మీ, అన్న ప్రసాదం స్పెషల్ ఆఫీసర్ శాస్త్రి, అధికారులు పాల్గొన్నారు.


Tags:    

Similar News