Tirumala|| శ్రీవాణి ట్రస్ట్ నిర్వహణ పై టీటీడీ ఈవో సమీక్ష.

భక్తులకు సులభతరంగా, పారదర్శకంగా ఉండేలా చూడాలి.;

Update: 2025-05-17 18:26 GMT

శ్రీవాణి ట్రస్ట్ నిర్వహణ పై ఈ రోజు టీటీడీ ఈవో జె.శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో శ్రీవాణి ట్రస్ట్ లో ప్రస్తుతం ఉన్న నిబంధనలను పునఃసమీక్షించుకుని మరింత మెరుగ్గా, సులభతరంగా, పారదర్శకంగా ఉండేలా తయారు చేయాలని టిటిడి ఈవో జె. శ్యామల రావు అధికారులను ఆదేశించారు.

టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో శనివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ. సనాతన ధర్మాన్ని మరింత విస్తృతంగా జన బాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు ఆలయాల నిర్మాణాలు పునాదులు లాంటివని ఆయన మాట్లాడారు. ఆలయాల నిర్మాణాలతో దైవచింతన, ఆధ్యాత్మికత, సేవా భావం సమభావంతో మానవ సంబంధాలు పెరుగుతాయన్నారు.
ఇప్పటికే సమరసత సేవా ఫౌండేషన్, దేవాదాయ శాఖ సౌజన్యంతో నిర్మితమవుతున్న ఆలయాల ప్రస్తుత స్థితికి సంబంధించిన పనులు ఏ దశలో ఉన్నాయో నివేదిక తయారు చేయాలన్నారు.
పూర్తి అయిన ఆలయాలకు ధూప దీప నైవేద్యాలు, నిర్వహణ అందించేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఆలయాల నిర్మాణం జరుగుతున్నపుడు, పూర్తయిన తర్వాత ఆలయ నిర్వహణను టిటిడి తరచూ తనిఖీలు చేపట్టాలని సూచించారు.
నిరాదరణకు గురైన ఆలయాల్లో ధూప దీప నైవేద్యాల నిర్వహణకు పక్కాగా ప్రణాళిక, వెనుకబడిన ప్రాంతాల్లో నిర్మించిన ఆలయాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా యంత్రాంగాన్ని రూపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవో వి. వీరబ్రహ్మం, చీఫ్ ఇంజనీర్ టి.వి. సత్యనారాయణ, ఎఫ్ఏసిఏవో ఓ. బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News