Tirumala|| తిరుమల ఘాట్‌ రోడ్డులో ఏనుగుల గుంపు హల్‌ చల్‌.!

వణికిపోయిన శ్రీవారి భక్తులు;

Update: 2025-07-03 23:30 GMT

తిరుమల కొండపై మళ్లీ ఏనుగులు హల్‌ చల్‌ చేశాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఏనుగుల గుంపు తిష్ట వేసి ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి.

ఘాట్‌ రోడ్డు పక్కనే ఏనుగుల గుంపు హల్చల్‌ చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇక ఆ గుంపులో నాలుగు ఏనుగులు, ఒక గున్న ఏనుగు ఉన్నాయి.
అటుగా వెళుతున్న కొంతమంది యువకులు గట్టిగా అరుపులు కేకలతో అరవడంతో వెనక్కి వెళ్లిన గజరాజులు.‌
కాగా కొన్ని రోజులుగా శేషాచలం అడవుల్లోని ఏనుగులు చుట్టుపక్కల గ్రామాల్లోకి ప్రవేశిస్తూ హల్చల్‌ చేస్తున్నాయి.
పంట పొలాలపై పడి బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏనుగులను అడవుల్లోకి తరిమేందుకు ఫారెస్ట్‌ అధికారులు ప్రయత్నిస్తున్నా. ప్రతి రోజు ఏదో ప్రాంతంలో దాడులు చేస్తుండడంతో స్థానికులు భయపడుతున్నారు. అలా ఇప్పుడు కూడా ఏనుగులు ఘాట్‌ రోడ్డులో హల్‌ చల్‌ చేశాయి.


Tags:    

Similar News