తిరుమలలో దివ్వెల మాధురి పై కేసు నమోదు ..!

Update: 2024-10-11 00:30 GMT

వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు బిగ్ షాక్ తగిలింది. అతని సన్నిహితురాలు దివ్వెల మాధురిపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని సన్నిధిలో శ్రీవారి పుష్కరిణితో పాటు ఆలయంలో ఫొటో షూట్ చేశారు. అలాగే పవిత్రమైన తిరుమల మాడవీధుల్లో పబ్లిక్ న్యూసెన్స్ చేస్తూ రీల్స్ చేసింది ఫిర్యాదులు అందాయి. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తమ వ్యక్తిగత బంధాల గురించి మాట్లాడారని ఆరోపించారు. ఈ కారణాలతో టీటీడీ అధికారులు ఫిర్యాదు చేశారు.దీంతో దివ్వెల మాధురితో పాటు దువ్వాడ శ్రీనివాస్‌పై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రజల మనోభావాలను దెబ్బతీసేవిధంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో వ్యవహరించారని 292, 296, 300 బీఎన్ఎస్, సెక్షన్66 ఈ ఏటీ యాక్ట్, 2000-2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, గత కొంతకాలంగా దివ్వెల మాధురికి సంబంధించిన వీడియోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. దువ్వాడ సతీమణి వాణి సైతం మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News