ఉద్యోగ నోటిఫికేషన్లపై రూట్ మార్చిన సర్కార్.. మందకృష్ణ వార్నింగే ఇందుకు కారణమా..

ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాతనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు.

Update: 2024-10-10 10:08 GMT

ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాతనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును కూడా తూచా తప్పకుండా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సుప్రీంతీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం కోసం హైకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ఏకసభ్య కమిషన్‌ను వెంటనే నియమించాలని కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిషన్ 60 రోజుల్లోగా ఎస్సీ వర్గీకరణపై నివేదిక సర్పంచాలన, ఆ నివేదిక ప్రకారమే ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు చేస్తామని స్పస్టం చేశారు సీఎం రేవంత్. దాంతో పాటుగానే బీసీ సామాజిక, కుల, ఆర్థిక కుల సర్వేను కూడా వెంటనే ప్రారంభించాలని వివరించారు.

అన్నీ పరిశీలించిన తర్వాతే

ఎస్సీ వర్గీకరణ, బీసీ సామాజిక సర్వేకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అప్‌డేట్ ఇచ్చారు. దీనికి సంబంధించి తమిళనాడు, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో అమలవుతున్న తీరును పూర్తిగా అధ్యయనం చేశామని చెప్తూ, తమ నివేదికను అందించారు ఉత్తమ్. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. ‘‘న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఎస్సీ జనాభా లెక్కలకు సంబంధించి 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలి. ఏకసభ్య కమిషన్‌కు అవసరమైన సమాచారాన్ని అన్ని విభాగాలు అందించాయి. ఈ విషయంలో సమాచారం ఇవ్వడంలో ఏ విభాగం కూడా జాప్యం చేయకూడదు. ఈ సమాచారం అందేలా చూసే బాధ్యత సీఎస్‌దే. ఈ ఏకసభ్య కమిషన్ పది జిల్లాల్లో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నాం’’ అని సీఎం వివరించారు. కాగా ఉద్యోగాల భర్తీ, ఎస్సీ వర్గీకరణను ఉద్దేశించి మందకృష్ణ మాదిక.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన అతి తక్కువ సమయంలోనే ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం. మందకృష్ణ.. ర్యాలీలకు పిలుపునివ్వడంతో వాటిని అడ్డుకోవడానికి, బీసీలలో ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను అరికట్టడం కోసమే ప్రభుత్వం ఈ ప్రకటన చేసిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

మందకృష్ణ అసలేమన్నారంటే..

ఎతెలంగాణలోని మాదిగలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీవ్ర అన్యాయం చేసిందని, నమ్మకద్రోహం చేసిందంటూ మందకృష్ణ మాది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారాయన. మాదిగలపైన ప్రేమ సీఎం రేవంత్ మాటల్లోనే తప్ప చేతల్లో రవ్వంతైనా లేదని ఆయన మండిపడ్డారు. మాదిగలను నట్టేట ముంచడమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ చేష్టలు ఉన్నాయంటూ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి.. మాలల పక్షాన నిలుస్తూ మాదిగలకు నమ్మక ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరగకుండానే ఉద్యోగాల భర్తీని సీఎం ఎలా వేగవంతం చేస్తారు? అని కూడా మందకృష్ణ ప్రశ్నించారు. మాదిగల పట్ల సీఎం తీరు ఏమాత్రం సబబుగా లేదని, అందుకు గాను రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో అంబేద్కర్ విగ్రహాల దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీసుల వరకు ర్యాలీలు నిర్వహించి నిరసన, ఆందోళన వ్యక్తం చేయాలని, కలెక్టర్లకు మాదిగల కష్టాలను తెలియజేస్తూ వినతి పత్రాలను అందించాలని పిలుపునిచ్చారు మందకృష్ణ. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి బషీర్ బాగ్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. అన్ని విషయాల్లో మాదిగలను తొక్కేసేలానే సీఎం చేష్టలు ఉన్నాయిన, అందుకు పీసీసీ చీఫ్ ఎన్నికల ఉదాహరణ అని చెప్పారు. పీసీసీ ఎన్నికల్లో మాదిగలకు తక్కువ సీట్లు ఇచ్చి మాలలకు అధిక సీట్లు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మాదిగలకు కేవలం 4 సీట్లు తగ్గించారని, అందుకు సీఎం రేవంత్ రెడ్డే కారణమని విమర్శించారు.

రేవంత్‌కు ఆ గతి తప్పదు

ఎస్సీ వర్గీకరణ లేకుండా ఈ నెల 11న ఉపాధ్యాయ ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్నారని గుర్తు చేశారు. ఇలానే చేస్తే రేవంత్ రెడ్డి.. మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సందర్బంగానే ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలు అన్ని సమావేశమై భవిస్యత్ కార్యాచారణపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఇదేంటని అడిగిన కొందరు ఎమ్మెల్యేలతో మాల సామాజిక వర్గానికి చెందని ఖర్గు, కొప్పుల రాజు ఆగ్రహానికి గురై పదవి పోగోట్టుకోవాలా? అని రేవంత్ అన్నారని, అవసరమైతే అతి త్వరలోనే ఆ ఎమ్మెల్యేల పేర్లు కూడా బయట పెడతానని మందకృష్ణ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ఎస్సీ వర్గీకరణ జరగకుండా ఉద్యగాల విషయంలో ముందుకు వెళ్లొద్దని ఆయన హెచ్చరించారు.

Tags:    

Similar News