మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ సెలబ్రిటీల ప్రచారం
మిస్ వరల్డ్ పోటీల గురించి తెలంగాణ సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నారు. ‘హైదరాబాద్ జరూర్ ఆనా’ అంటూ మంచు లక్ష్మి, పీవీ సింధూ, నిఖత్ జరీన్ వీడియోలను విడుదల చేశారు.;
హైదరాబాద్ నగరంలో 72 మిస్ వరల్డ్ పోటీలు (Miss World 2025) ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న నేపథ్యంలో తెలంగాణ పర్యాటక శాఖ సెలబ్రిటీలతో ప్రచారం ఆరంభించింది. హైదరాబాద్ నగరంలో జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీల గురించి తెలంగాణ సెలబ్రిటీలు, స్పోర్ట్సు సార్లు ప్రచారం చేస్తున్నారు.
మిస్ వరల్డ్ పోటీలను తిలకించేందుకు ‘హైదరాబాద్ జరూర్ ఆనా’ అంటూ ప్రముఖ సినీనటి మంచు లక్ష్మి, క్రీడాకారిణులు పీవీ సింధూ, నిఖత్ జరీన్ ల వీడియోలను తెలంగాణ పర్యాటక శాఖ విడుదల చేసింది.
హైదరాబాద్ కు రండి అంటూ పీవీ సింధూ పిలుపు
మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణకు గర్వ కారణం : మంచు లక్ష్మీ
తెలంగాణలోని ఉత్సాహభరితమైన సంప్రదాయాలు, రంగులు, సాంస్కృతిక గొప్పతనాన్ని చాటే పోటీదారులను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను అంటూ మంచు లక్ష్మీ పేర్కొన్నారు.
హైదరాబాద్ జరూర్ ఆనా : నిఖత్ జరీన్
మిస్ వరల్డ్ పోటీలకు విమానాశ్రయం ముస్తాబు
ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాల నుంచి వచ్చే అందాల భామలకు స్వాగతం చెప్పేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టును ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి విదేశీ ప్రతినిధుల రాక పెరగనుంది. దీనికోసం ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేక లాంజ్ లతో పాటు, హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు.తెలంగాణ పర్యాటక ప్రాంతాలు,ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ జరూర్ ఆనా (Must Visit Telangana) నినాదం ప్రతి చోటా కనిపించేలా, వినిపించేలా పర్యాటకశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.