హైదరాబాద్ అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా
చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి బంధువులకు ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.;
చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ.5లక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఉస్మానియా ఆసుపత్రిలో మృతదేహాలకు వెంటనే పోస్టు మార్టం చేసి వారి బంధువులకు అందజేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మంత్రివర్గం తీవ్ర దిగ్ధ్రాంతి వ్యక్తం చేసిందని భట్టి చెప్పారు. ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క, వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ లు వచ్చారు.ఉస్మానియా హాస్పిటల్ మార్చుూరీలో ఉన్న అగ్ని ప్రమాద మృత దేహాలను మంత్రి దామోదర రాజనర్సింహ పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సానుభూతి తెలిపారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి భరోసా కల్పించారు. పోస్ట్మార్టం ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, బాధిత కుటుంబాలకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించిన మంత్రి ఆదేశించారు.