50 రోజులు దాటినా ఎస్ఎల్బీసీ టన్నెల్ లో మృతదేహాల జాడ ఏది?
ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల 50 మీటర్ల మేర సహాయ పనులను మరో అయిదు రోజుల్లో పూర్తి చేస్తామని సీనియర్ ఐఎఎస్ అధికారి శివశంకర్ లోతేటి వెల్లడించారు.;
శ్రీశైలం ఎడమ గట్టు కెనాల్ టన్నెల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ లోపల సహాయ పనులను మరో అయిదు రోజుల్లో పూర్తి చేస్తామని సహాయ పనులను పర్యవేక్షిస్తున్న సీనియర్ ఐఎఎస్ అధికారి శివశంకర్ లోతేటి సోమవారం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. సొరంగం లోపల 50 మీటర్ల మేర మట్టి, బురద, టన్నెల్ బోరింగ్ మిషన్ యంత్రాల ముక్కలు పడి ఉన్నాయని వాటిని మరో అయిదు రోజుల్లో తరలించి, లోపల చిక్కుకున్న ఆరుగురి మృతదేహాలను వెలికితీస్తామని శివశంకర్ పేర్కొన్నారు. ఒక వేళ మృతదేహాలు దొరకకుంటే సహాయ పనుల తీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ఆయన చెప్పారు.
ఆరు మృతదేహాల కోసం కొనసాగుతున్న సహాయ పనులు
మృతదేహాలు కుళ్లిపోయే అవకాశం
సొరంగం లో వెంటిలేషన్ వ్యవస్థ పునరుద్ధరణ
నిర్విరామంగా కొనసాగుతున్న సహాయక చర్యలు
మూడు షిఫ్టుల్లో సహాయ పనులు
రేవంత్ సర్కారు విఫలం : మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు