తెలంగాణలో పాస్పోర్టుకోసం దరఖాస్తు చేసుకున్నారా? అయితే చదవండి
తెలంగాణలో పాస్పోర్టు దరఖాస్తుదారులకు శుభవార్త .;
తెలంగాణ రాష్ట్రంలో పాస్పోర్టు దరఖాస్తుదారులకు హైదరాబాద్ అధికారులు శుభవార్త వెల్లడించారు. కొత్తగా పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎలక్ట్రానిక్ చిప్ ఆధారిత పాస్ పోర్టులను జారీ చేయనున్నట్లు హైదరాబాద్ పాస్ పోర్టు కేంద్రం అధికారులు తెలిపారు. దేశంలోని 12 కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్టు కింద విదేశీ మంత్రిత్వశాఖ ఈ చిప్ ఆధారిత పాస్ పోర్టుల జారీకి ఎంపిక చేసింది. హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయంతో పాటు చెన్నై, నాగ్ పూర్, భువనేశ్వర్, జమ్మూ, సిమ్లా, రాయ్ పూర్, అమృత్ సర్, జైపూర్, సూరత్, రాంచీ కేంద్రాల ద్వారా ఈ చిప్ పాస్ పోర్టులను జారీ చేయనుంది. దీంతో గతంలో సాధారణ పాస్ పోర్టు దరఖాస్తు రుసుం 1500రూపాయలు ఉండగా, దీన్ని రెండువేల రూపాయలకు పెంచింది. ఈ పాస్ పోర్టును నాసిక్ లోని ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ లో ఇ చిప్ ను చొప్పించి ముద్రిస్తున్నారు.