మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై ఫోర్జరీ కేసు

పరకాల మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీకి చెందిన చల్లా ధర్మారెడ్డిపై మాదాపూర్ పోలీసులు ఫోర్టరీ కేసు నమోదైంది.మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు సంచలనం రేపింది.

Update: 2024-10-02 08:47 GMT

పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రియల్టర్ పురుషోత్తం నాయుడుపై మాదాపూర్ పోలీసులు ఫోర్జరీ కేసు పెట్టారు. విజన్ రిసార్ట్స్ పార్ట్నర్ గంటా రాజశేఖర్ రావు ఫిర్యాదు మేరకు పోలీసులు మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.

- తన ఇంట్లోకి చొరబడి సంతకాలు పెట్టమని ధర్మారెడ్డి బెదిరిస్తున్నారని రాజశేఖర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.తనకు తెలియకుండానే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నారు. తన ఇంట్లోకి అక్రమంగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే తనను చంపుతామని బెదరిస్తున్నారని ఫిర్యాదులో రాజశేఖర్ రావు పేర్కొన్నారు.
- బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై పోలీసులు ఫోర్టరీ కేసు నమోదు చేయడం సంచలనం రేపింది.


Tags:    

Similar News