కాళేశ్వరం కట్టిన వారి హయాంలోనే కూలిపోయింది: ఉత్తమ్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే తెలంగాణకు కృష్ణాజలాల్లో 500 టీఎంసీలు కావాలన్న వాదన ప్రారంభమైందని చెప్పారు ఉత్తమ్.;
బీఆర్ఎస్ ప్రభుత్వం, కాళేశ్వరం ప్రాజెక్ట్పై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏసీ సర్కార్ చేస్తున్న జలదోపిడీకి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి సహకారం అందించిందని అన్నారు. తెలంగాణకు కృష్ణజలాల్లో 200 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన ఘనత బీఆర్ఎస్దని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే తెలంగాణకు కృష్ణాజలాల్లో 500 టీఎంసీలు కావాలన్న వాదన ప్రారంభమైందని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే మహబూబ్నగర్ జిల్లా ఇప్పుడు అద్భుతంగా ఉండి ఉండేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేతకాని తనంవల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు.
‘‘లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన వారి హయాంలోనే కూలిపోయింది. ఈ ప్రాజెక్టు వల్ల నీళ్లు రాలేదు కానీ.. వాళ్ల జేబులు నిండాయి. కాళేశ్వరం కూలిపోయింది. పాలమూరు కింద ఒక్క ఎకరం ఆయకట్టు రాలేదు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పూర్తి వైఫల్యం చెందారు. కృష్ణా వాటర్ లో తెలంగాణ కు అన్యాయం జరగొద్దని.. కేంద్రమంత్రి cr పాటిల్ కు వివరించా. పదేండ్ల పాటు అధికారం లో ఉండి.. టెలిమెట్రిక్ ఏర్పాటు చేయలేక పోయారు. ఏపీ జల దోపిడీ కి సహకరించారు. పదేండ్ల పాటు తెలంగాణ కు కృష్ణా జలాల్లో అన్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. పాలమూరు రంగా రెడ్డి పూర్తి చేయలేదు. పదేండ్ల కాలంలో నీటి కేటాయింపులు సాధించలేదు’’ అని విమర్శలు గుప్పించారు.
‘‘శ్రీశైలం, నాగార్జున సాగర్ రిపేర్ల ను కూడా మేమే ముందుకు తీసుకెళ్తున్నాం. కాళేశ్వరం కూలితే.. స్వయంగా ndsa రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. బేసిక్ విచారణ లోనే.. ప్రాజెక్టు డిజైన్ తప్పు ఉందని ndsa స్పష్టం చేసింది. నీళ్లు నింపవద్దని స్వయంగా ndsa లిఖిత పూర్వకంగా లేఖ రాసింది. ప్రాజెక్టుల్లో కమీషన్ కోసం 12 శాతం వడ్డీకి రుణాలు తెచ్చారు. ప్రాజెక్టుల రుణాలను నెగోషియేట్ చేసి 7 శాతానికి తగ్గించాం. జగన్ తో విందు వినోదాలు చేసుకొని.. తెలంగాణ కు తీవ్ర అన్యాయం చేశారు. Slbc టన్నెల్ పనులను పూర్తి స్థాయి లో కంప్లిట్ చేస్తాం. కృష్ణా లో గత పాలకుల అసమర్ధత కారణంగా తెలంగాణకు కేటాయింపులు 299 టీఎంసీ లు ఉంటే కేవలం 180 టీఎంసీ లు మాత్రమే వాడగలిగారు’’ అని తెలిపారు.
‘‘ఏపీ పునర్ విభజన చట్టంలో సాగునీటి కేటాయింపు ల్లో తెలంగాణ కు జరిగిన అన్యాయన్ని సరి చేయలేదు. కెసిఆర్, హరీష్ రావు పలు మార్లు జరిగిన సమావేశాల్లో తెలంగాణ కు అన్యాయం జరిగేలా చేశారు. నీటి కేటాయింపులపై మేము వచ్చాకే సరి చేస్తున్నాం. Go 203 తో ప్రతీ రోజు 3 టీఎంసీ లు తరలించేలా జగన్ చేసిన ప్రయత్నాలకు సహకరించారు. ఆఖరికి ఆపేక్స్ కౌన్సిల్ మీటింగ్ ను కూడా.. ఏపీ కి సహకరించేలా వ్యవహరించారు. రాయలసీమ లిఫ్ట్ పనుల కోసం ఆపేక్స్ కౌన్సిల్ మీటింగ్ ను వాయిదా వేశారు. Go 203 తో ప్రతీ రోజు 3 టీఎంసీ లు తరలించేలా జగన్ చేసిన ప్రయత్నాలకు సహకరించారు. ఆఖరికి ఆపేక్స్ కౌన్సిల్ మీటింగ్ ను కూడా.. ఏపీ కి సహకరించేలా వ్యవహరించారు’’ అని విమర్శించారు.
‘‘రాయలసీమ లిఫ్ట్ పనుల కోసం ఆపేక్స్ కౌన్సిల్ మీటింగ్ ను వాయిదా వేశారు. నాగార్జున సాగర్ డ్యాం వద్దకు కెసిఆర్ హయాంలోనే ఏపీ అధికారులు రావడం.. Crpf కు అప్పగించింది కూడా వాళ్ల హయాంలోనే జరిగింది. సాగునీటి ప్రాజెక్టుల సంబంధించి ప్రతీ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. కృష్ణా బేసిన్ లో గత పదేళ్లలో తెలంగాణ కేవలం 30 శాతం మాత్రమే వాడింది. మేము వచ్చాక కృష్ణా లో తెలంగాణ కు 50 శాతం షేరింగ్ అడుగుతున్నాం. గత పాలకులు మోసం, దగా తో డబ్బులు దండుకున్నారు’’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.