‘‘తమిళనాడులో ఇప్పట్లో మూడో శక్తికి అవకాశం లేదు’’

కానీ అది ఎప్పకైన సాధ్యమే అన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం;

By :  491
Update: 2025-06-15 12:09 GMT
తమిళనాడు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం

ప్రమీలా కృష్ణన్

తమిళనాడులో సామాజిక న్యాయ విధానం, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో డీఎంకే నాయకులకు దేశవ్యాప్తంగా పేరుంది. అయితే తమిళనాడులో డీఎంకే కూటమి భాగస్వామి సీపీఐ(ఎం) కార్యదర్శి పి. షణ్ముగం భిన్నంగా ఆలోచిస్తున్నారు.

‘ది ఫెడరల్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి డీఎంకే పై పలు విమర్శలు చేశారు. ముఖ్యంగా 2021 నాటి మ్యానిఫెస్టో లో 90 శాతం నెరవేర్చామని అధికార డీఎంకే చేసిన వాదనలను విమర్శించారు. ఉపాధ్యాయ నియామకం, చెరకు రైతులకు న్యాయమైన ధరల పెంపు వంటి హమీలను పూర్తిగా పక్కన పెట్టారని అన్నారు.
విద్యా సంస్థలలో కుల వివక్ష, ఎంపిక చేసిన పథకాల అమలును ఉదహరిస్తూ డీఎంకే సామాజిక న్యాయాన్ని ఒక ప్రత్యక్ష విధానంగా కాకుండా రాజకీయ సాధనంగా ఉపయోగిస్తోందని షణ్ముగం ఆరోపించారు. ద్రావిడ పార్టీ తన అస్పష్టతలను తొలగించి, తమ విధానాలను పూర్తి స్పూర్తితో అమలు చేయాలని ఆయన కోరారు.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) మరిన్ని సీట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. డీఎంకే నేతృత్వంలోని కూటమిని కొనసాగించడంలో తమ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు.
నటుడు విజయ్ కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆయన తన రాజకీయ తీవ్రతను ప్రశ్నించారు. యువతను అట్టడుగు స్థాయి నుంచి ఆకర్షించడానికి సినీ గ్లామర్ ను తీసుకొచ్చారని అన్నారు.
తమిళనాడులో మూడో ఫ్రంట్ కోసం అవకాశాలు ఉన్నాయని, కానీ 2026 లో దాని ఆచరణీయత మాత్రం కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీలకు ఆ విషయంలో దీర్ఘదృష్టి లేదని అన్నారు. ఆయనతో జరిగిన ఇంటర్వ్యూలోని విశేషాలు..
2021 మ్యానిఫెస్టోలో ఇచ్చిన హమీలలో 90 శాతానికి పైగా నేరవేర్చామని డీఎంకే నాయకుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ చెబుతున్నారు. కూటమి భాగస్వామిగా ఈ వాదన నిజమని మీరు నమ్ముతున్నారా?
డీఎంకే తరుచుగా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతోంది. కానీ క్షేత్ర స్థాయిలో ఇది మాత్రం కనిపించడం లేదు. దళితుల గురించి మాట్లాడేటప్పుడూ నీరు, దేవాలయాలు, వారి గౌరవం వంటి వాటి పోరాటంలో రూపం మారింది. రిజర్వేషన్ విధానం ద్వారా ఉపాధి కల్పించడం సామాజిక న్యాయం సాధించడానికి ప్రధాన మార్గం అని డీఎంకే విశ్వసిస్తుంది.
కానీ సామాజిక న్యాయం అనేది విస్తృత సిద్దాంతం, రిజర్వేషన్ ద్వారా మాత్రమే దీనిని సాధించలేము. డీఎంకే దీనిని కేవలం రాజకీయ కవచంగా, ప్రజాదరణ పొందిన నినాదంగా ఉపయోగించుకుంటోంది. కానీ క్షేత్ర స్థాయిలో మనకు బలమైన చర్యలు అవసరం.
గ్రామ దేవాలయాల్లో దళితులకు ఆలయ ప్రవేశం ఇప్పటికి ఒక సమస్యగానే ఉంది. విద్యా సంస్థల్లో కుల వివక్ష ప్రబలంగా ఉంది. డీఎంకే ప్రభుత్వం బాధిత దళితులకు పరిహారంపై దృష్టి సారించినప్పటికీ అణగారిన వారిపై హింసకు కారణమయ్యే బీసీ లేదా ఎంబీసీ వ్యక్తి సమూహంపై చర్యలు తీసుకోవడంలో అదే స్థాయిలో స్ఫూర్తిని ప్రదర్శించడం లేదు.
ఉదాహారణకు నగరాల్లో నీటి వనరుల సమీపంలోని మురికి వాడల నుంచి పేద ప్రజలను ఖాళీ చేయించే సమయంలో వారు నిమిషాల్లోనే ప్రజలను నిర్వాసితులను చేస్తారు. బుల్డోజర్లు, క్రేన్లు సంఘటన స్థలానికి చేరుకుంటాయి. వారి గుడిసెలు ధ్వంసం అవుతాయి.
ఆక్రమణలను తొలగించాలన్న కోర్టు ఆదేశాన్ని అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ ప్రయివేట్ పరిశ్రమలకు భూముల కేటాయింపు, ప్రభుత్వ భవనాలకు స్థలం కేటాయింపు విషయానికి వస్తే నీటి వనరులను నిర్మాణ స్థలాలుగా మారుస్తున్నారు. నగరాల నుంచి ప్రజలను బహిష్కరిస్తూ సామాజిక న్యాయ విధానాన్ని అమలు చేయడంలో వారు ఎందుకు విఫలమవుతున్నారు?
పట్టణ ప్రాంతాల నుంచి శివార్లకు నిరుపేదలను తరలించడం సామాజిక న్యాయాన్ని ఉల్లంఘించడం కాదా?
స్టాలిన్ తండ్రి కరుణానిధి సడతువపురం( పెరియార్ స్మారక సమానత్వ గ్రామం) ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. ఇది సామాజిక సామరస్యాన్ని మెరుగుపరచడానికి, కుల వివక్షను తగ్గించడానికి 1998 లో తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించిన సామాజిక సమానత్వ పథకం.
ఈ పథకం కింద వివిధ కులాలకు వసతి కల్పించడానికి ఒక్కొక్కటి 100 ఇళ్లతో కూడిన గ్రామాలను సృష్టిస్తున్నారు. ఒక కమ్యూనిటీ హాల్ అందరూ పంచుకునే శ్మశాన వాటికతో సహ దాదాపు 200 సమతువపురాలను నిర్మించినప్పటికీ అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయారు.
తమిళనాడులో ఓటర్లు సామాజిక న్యాయ సూత్రాలను నమ్ముతున్నారు. డీఎంకే తన రాజకీయ అవసరాల కోసం సామాజిక న్యాయ విధానాన్ని అమలు చేయడానికి ఇంకా ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంది.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీ కూటమిలో పెద్ద భాగస్వామి అయిన డీఎంకే నుంచి అదనపు సీట్లను ఏమయిన కోరుకుంటోందా? మెరుగైన ఒప్పందం కోసం ఎలాంటి వ్యూహాలను అనుసరించబోతున్నారు?
2021 లో డీఎంకేతో సీట్ల పంపకాల ఒప్పందం పై సంతకం చేసిన చివరి వ్యక్తులలో మేము ఉన్నాము. మాకు కేవలం ఆరు సీట్లు మాత్రమే ఇచ్చారు. ఇది ద్రావిడ పార్టీలతో మా పొత్తు చరిత్రలో అత్యల్పం.
ఆ సమయంలో బలపడుతున్న అన్నాడీఎంకే- బీజేపీ కూటమిని ఓడించాలనే లక్ష్యంతో మేము మద్దతు ఇవ్వడానికి మేము అత్యల్ప సీట్లకు అంగీకరించాము.
ఈసారి మాకు మరిన్ని అదనపు సీట్లు అవసరం ఎందుకంటే మేము కూటమిలోనే ఉన్నాము. కూటమి ఐక్యత ఓటర్ల దృష్టిలో డీఎంకే మంచి అభిప్రాయం ఉంది. 2021 తో పోలిస్తే 2026 ఎన్నికల్లో మేము అదనపు సీట్లలో నుంచి పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నాము.
అవసరమైన సీట్లు రాకపోతే కూటమి నుంచి తప్పుకుంటారా?
మేము కోరుకున్న సంఖ్యలో సీట్లు సాధిస్తామని కచ్చితంగా అనుకుంటున్నాము. డీఎంకే విజయానికి కూటమి భాగస్వాముల ఐక్యత చాలా అవసరం. అది లేకుండా కేంద్రం అధికారం, డబ్బు మీడియా తమ వైపు ఉన్నందున బీజేపీ నేతృత్వంలోని బలమైన ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేము.
కూటమిలో మా పాత్ర చిన్నది కాదు. మేము సమీకరణలో కీలకమైన భాగం. సీట్ల పంపకాల చర్చలు ఇంకా ప్రారంభం కాలేదు. డీఎంకే నాయకులను కూడా కూటమి నెట్ వర్క్ ప్రాముఖ్యత తెలుసు కాబట్టి ప్లాన్ బీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.
సామాజిక సమస్యలపై మీ ప్రమేయం ఉన్నప్పటికీ యువత టీవీకే వంటి సెలబ్రిటీల పార్టీల వైపు ఆకర్షితులవుతున్నారు. మీ పార్టీ యువ ఓటర్లను ఎందుకు ఆకర్షించలేకపోయింది?
అవును నిజమే. ఇతర పార్టీలతో పోలిస్తే ముఖ్యంగా టీవీకేతో పోలిస్తే మా పార్టీలో యువత సంఖ్య తక్కువగా ఉంటుంది. మాకు కొంత యువత ఉనికి ఉన్నప్పటికీ మేము ఇంకా అవసరమైన స్థాయిలో మాత్రం లేము.
డిజిటల్ ప్లాట్ ఫాం లకు అనుగుణంగా మారడంలో మేము ఇంకా వెనకబడి ఉన్నాము. బీజేపీ, డీఎంకేలకు శక్తివంతమైన ఐటీ విభాగాలు ఉన్నాయి. అవి సాటిలేని జీతాలను అందిస్తున్నాయి.
మేము ఇప్పుడిప్పుడే సొంతంగా ఐటీ విభాగాలను నిర్మిస్తున్నాము. అందులో యువతను తీసుకుంటున్నాము. ప్రస్తుతం మొత్తం పార్టీ కార్యకర్తలలో దాదాపు 22 శాతం మంది 18 నుంచి 31 సంవత్సరాల మధ్య యువత ఉంది. దీనిని ఇంకా పెంచాలని అనుకుంటున్నాము.
సమాజంలో బలం లేని వారికోసం పనిచేస్తున్నాము. కావున ప్రభావంపరంగా సినీ గ్లామర్ తో పోలిస్తే ఆకర్షణ తక్కువ. మనం దీర్ఘకాలికంగా పోరాడి సాధించిన మార్పును ప్రజలు మర్చిపోతారు. ఈ యుగంలో ప్రజాదరణ తరుచుగా విధానాలను కప్పివేస్తోంది.
టీవీకే పార్టీ, దాని నాయకుడు విజయ్ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ఎదగడాన్ని మీరు ఎలా చూస్తారు?
విజయ్ ఇప్పటికే విజయవంతమైన నటుడిగానే ఉన్నాడు. ఆయన రాజకీయాల్లోకి రావడాన్ని మేము స్వాగతిస్తాము. కానీ ఆయన రాజకీయ నాయకుడిగా ఉండటంలో ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి.
అనేక మంది యువత ఆయనను అనుసరించడానికి సిద్దంగా ఉన్నప్పుడు కనీసం వారిని ప్రభావితం చేసే సమస్యలను అర్థం చేసుకోవాలి. వారి ప్రాథమిక అవసరాలను తీర్చకపోతే ఎలా నాయకులుగా మారతారు.
తనను తాను నాయకుడిగా ఎదగడానికి సిద్దం చేసుకోవాలి. రాజకీయ వేదికలో వేదిక నిర్వహణకు సహయపడదు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు రంగస్థల హీరోలు కాదు.. నిజమైన హీరోలు
ఒకప్పుడూ విజయ్ కాంత్ నేతృత్వంలోని పీపుల్స్ వెల్ఫేర్ అలయన్స్ తమిళనాడులో మూడో ఫ్రంట్ గా పేరు పొందింది. 2026 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో అలాంటి శక్తులకు అవకాశం ఉందా? ఉంటే అందులో మీ పార్టీ భాగస్వామ్యం అవుతుందా?
తమిళనాడులో మూడో ఫ్రంట్ కు అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను. కానీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అది కచ్చితంగా సాధ్యం కాదు. ప్రజలు ప్రత్యామ్నాయాల కోసం ఎదురు చూస్తున్నారు.
కానీ మూడవ శక్తిగా ఉండాలనుకునే రాజకీయ పార్టీలు ఎన్నికల్లో విఫలమైన ఓపికగా తమ కూటమిని నిర్మించుకోవాలి. ఇప్పుడు పరిస్థితి అలా కాదు. ఎవరు పెట్టిన వారు తదుపరి ఎన్నికల వరకూ కూడా ఉండరు. అలాంటి మూడో శక్తి ఏర్పడితే మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము.


Tags:    

Similar News