మా రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి: ప్రధాని
ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన మోదీ;
భారత్ పై ఇన్నాళ్లు సుంకాల రంకెలు వేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నిన్న స్వరం మార్చి భారత్, రష్యాను దూరం చేసుకున్నామని వ్యాఖ్యానించారు. చైనా చేతిలో భారత్, రష్యా లు చిక్కుకున్నాయని కూడా అభిప్రాయపడ్డారు. తాను ఎప్పుడూ మోదీతో స్నేహంగా ఉంటానని చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. భారత్, అమెరికా మధ్య సానుకూల వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని అన్నారు. ‘‘మా సంబంధాలపై అధ్యక్షుడు ట్రంప్ భావాలను, సానుకూల అంచనాను లోతుగా అభినందిస్తున్నాము. భారత్, అమెరికా సానుకూల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని సమగ్ర, ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాయి’’ అని ఎక్స్ లో ట్వీట్ చేశారు.
Deeply appreciate and fully reciprocate President Trump's sentiments and positive assessment of our ties.
— Narendra Modi (@narendramodi) September 6, 2025
India and the US have a very positive and forward-looking Comprehensive and Global Strategic Partnership.@realDonaldTrump @POTUS https://t.co/4hLo9wBpeF