నామినేటేడ్ ఎమ్మెల్యేల వివాదం ముగిసినట్టేనా?

కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్ లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ప్రభుత్వ ఏర్పాటకు అవసరమైన మేజిక్ ఫిగర్ ను పొందింది. దీనితో తాత్కలికంగా..

By :  491
Update: 2024-10-08 09:33 GMT

జమ్ముకాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు పొద్దున వరకూ ఉన్న నామినేటేడ్ సభ్యుల సమస్య తాత్కలికంగా మరుగున పడినట్లు అయింది. తాజాగా వెలువడుతున్న ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ప్రభుత్వం ఏర్పాటకు అవసరమైన మేజిక్ ఫిగర్ ను అందుకుంది. దాదాపు యాభై సీట్లతో కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఎల్జీ నామినేటేడ్ వివాదం ఏంటీ?

జమ్మూ కాశ్మీర్ దశాబ్దం తర్వాత కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి కొన్ని గంటల సమయం ఉన్నందున, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలతో కేంద్ర పాలిత ప్రాంతంలోని కొత్త అసెంబ్లీకి ఐదుగురు సభ్యులను నామినేట్ చేసే లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి) మనోజ్ సిన్హాకు ఉన్న అధికారంపై రాజకీయ దుమారం చెలరేగింది. ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ ఇదే విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ప్రభుత్వ ఏర్పాటులో ఎల్‌జీ నియమించిన ఎమ్మెల్యేలకు అధికారం ఉంటుందా లేదా అనేది అస్పష్టంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్, దాని మిత్రపక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) కూడా అలాంటి చర్యకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బెదిరించాయి.
ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఎల్‌జీ అధికారాన్ని వినియోగించుకోగలరా లేదా మంత్రి మండలి సాయం, సలహాతో దీన్ని చేయాలా అన్నది చట్టంలో లేదు. ఒకవేళ కేంద్ర పాలిత ప్రాంతంలో హంగ్ అసెంబ్లీ వస్తే ఎలా అన్న అంశంపై ఇది ఆధారపడి ఉంది.
జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ చర్చ ఊపందుకుంది. ఆర్టికల్ 370 రద్దు తరువాత 2019 లో రాష్ర్టం రెండుగా విభజించబడింది. దాదాపు దశాబ్ధంగా మూడు దశల ఎన్నికల్లో 90 మంది సభ్యుల అసెంబ్లీకి ఎమ్మెల్యేలను ఎన్నుకునేందుకు ఓటు వేసింది.
ప్రభుత్వ ఏర్పాటు సమయంలో శాసనసభ్యులను నియమిస్తారా?
పొత్తుల మెగా పోరులో, ఐదుగురు నామినేటెడ్ సభ్యుల చేరికతో హౌస్ బలం 95కి, మెజారిటీ మార్కు 48కి చేరుకుంటుంది. బీజేపీకి లాభదాయకంగా ఉండే ఈ సభ్యులకు అదే అధికారాలు, ఓటింగ్ హక్కులు ఉంటాయి. ఇతర ఎమ్మెల్యేలతో పాటు సమానంగా హక్కులు ఉంటాయి.
శనివారం నాటి అనేక ఎగ్జిట్ పోల్స్ ఎన్‌సితో కాంగ్రెస్ పొత్తుకు ఎక్కువ అవకాశాలు వచ్చాయి, ప్రాంతీయ భాగస్వామి అతిపెద్ద పార్టీగా ఈ రెండు పార్టీలు అవతరించబోతున్నాయి.
ప్రభుత్వం ఏర్పడే సమయంలో ఐదుగురు ఎమ్మెల్యేలను ఎల్‌జీ నామినేట్ చేయవచ్చా లేదా మంత్రి మండలి సలహా మేరకు తదుపరి దశలో నామినేట్ చేయవచ్చా అనే దానిపై న్యాయ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఐదుగురు సభ్యులలో ఇద్దరు మహిళలు, ఇద్దరు వలస వర్గాలకు చెందినవారు, అలాగే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (POJK) నుంచి ఒక శరణార్థి ఉంటారు.
2023లో సవరించిన జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ప్రకారం, ప్రభుత్వ ఏర్పాటులో నామినేటెడ్ ఎమ్మెల్యేల పాత్ర ఉంటుందా లేదా అనే అంశంపై "అస్పష్టంగా" ఉందని సుప్రీంకోర్టు న్యాయవాది అశ్వనీ కుమార్ దూబే జాతీయ మీడియాకి చెప్పారు.
ఐదుగురు సభ్యులను నామినేట్ చేయడానికి ఎల్‌జీకి ఉన్న అధికారం గురించి, మంత్రి మండలి సాయం, సలహా లేకుండా దీనిని ఉపయోగించవచ్చా అనే దాని గురించి, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) ఎస్ఎన్ ధింగ్రా మాట్లాడుతూ, అసలు ఎన్నికల ఫలితాలు, సమస్య కోసం వేచి చూడాలన్నారు.
కోర్టును ఆశ్రయిస్తాం: పీడీపీ, ఎన్సీ..
ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో ఐదుగురు సభ్యులను నామినేట్ చేసే ఏ చర్యకైనా వ్యతిరేకంగా తమ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఎన్‌సి అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా చెప్పారు.
"ప్రభుత్వం ఏర్పడుతున్నందున ఎల్‌జీ మొదట ఈ ప్రక్రియకు దూరంగా ఉండాలి. వ్యక్తులను నామినేట్ చేయడం కేవలం ఎన్నికైన ప్రభుత్వం పని. అది సాధారణ విధానం. వారు ఏమి చేయలనుకున్నారు. నేను అయితే అలా చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్తాం. ’’ అని అబ్దుల్లా అన్నారు.
జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ తారిఖ్ హమీద్ కర్రా మాట్లాడుతూ, అటువంటి చర్య ఏదైనా "పోల్ ఫలితాలను రిగ్గింగ్" అని, ప్రజాస్వామ్యం, ప్రాథమిక భావనకు విరుద్ధం, ప్రజల ఆదేశాన్ని ఓడించడమేనని వ్యాఖ్యానించారు. పీడీపీ నేత ఇల్తిజా ముఫ్తీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఐదుగురు ఎమ్మెల్యేలను ఎల్‌జీ నామినేట్ చేయడం పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జరుగుతోందని జమ్మూ కాశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా అన్నారు. ఈ ప్రాంతంలో బీజేపీ 35 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, భావసారూప్యత కలిగిన స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ప్రకటించారు.
ఇదిలా ఉండగా, మంటలకు మరింత ఆజ్యం పోస్తూ, ఐదుగురు అభ్యర్థులు తమ పార్టీకి చెందినవారేనని బీజేపీ నేత సోఫీ మహ్మద్ యూసుఫ్ ప్రకటించారు. నామినేటెడ్ సభ్యులంతా బీజేపీకి చెందిన వారే.. కేంద్రంలో మాది మా ప్రభుత్వమే.. ప్రభుత్వంలో ఎవరున్నా.. (నామినేట్ చేయబడిన) అభ్యర్థులు కూడా వాళ్లే అవుతారని యూసఫ్ అన్నారు.
ఐదుగురు నామినేటెడ్ సభ్యులు అశోక్ కౌల్, రజనీ సేథీ, ఫరీదా ఖాన్, సునీల్ సేథీ, బీజేపీ జమ్మూ కాశ్మీర్ మహిళా మోర్చా అధ్యక్షురాలు వీరు అసెంబ్లీకి వస్తారని పేర్కొన్నారు. ఈ పేర్లు ఆమోదించబడ్డాయా అని అడగ్గా, "ఇది ఇప్పటికే ముద్రించబడింది, మేము ఇప్పటికే ఐదు సీట్లు గెలుస్తాము" అని యూసఫ్ చెప్పారు.


Tags:    

Similar News