అదొక పేపరా, పేపర్ కు పట్టిన పీడా..

ఈనాడు అనేది పేపరా? లేక పేపర్‌కు పట్టిన పీడా? అంటూ వైఎస్‌ జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.;

Update: 2025-07-16 10:24 GMT

ప్రముఖ తెలుగు పత్రిక ‘ఈనాడు’ మీద మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు రేట్లు రాక అనేక కష్టాలు పడుతోంటే.. సంతోషంతో గెంతులు వేస్తున్నట్లు రాస్తోందని, అలాంటి ఈనాడు పత్రిక టాయిలెట్‌ పేపర్‌కు ఎక్కువ.. టిష్యూ పేపర్‌కు తక్కువ అని వైఎస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు. తన మీద, తమ పార్టీ నాయకుల మీద, తమ ప్రభుత్వ పాలన మీద ఇష్టం వచ్చినట్లు రాస్తోందని ధ్వజమెత్తారు. లేని పోనివి రాస్తూ బురదల్లే కార్యక్రమం చేస్తోందని మండిపడ్డారు.

తాడేపల్లి వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఈనాడు దినపత్రిక అనేది అదో పేపరా.. పేపర్‌కు పట్టిన పీడా అంటూ విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లోని రైతులంతా గిట్లుబాటు రేట్లు ఉన్నాయని ఆనందంగా కేరింతలు కొడుతున్నట్లు ఈనాడు పత్రిక రాస్తోందని, ఆంధ్రప్రదేశ్‌ రైతులు ధరల్లేక నానా ఇబ్బందులు పడుతోంటే.. కేరింతలు కొడుతున్నట్లు ఈనాడు రాస్తోందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధరల్లేక ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోక అల్లాడుతుంటే అలా రాయడం అదో పేపరా? అంటూ నిలదీశారు. రైతులకు రేట్లు లేకనే రూ. 12 డిక్లేర్‌ చేశారు. రూ. 4 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే అది ఇచ్చిన కథ దేవుడెరుగు కానీ ఈనాడులో బ్రహ్మాండమైన రేట్లతో రైతులు కేరింతలు కొడుతున్నట్లు, రైతులంతా తన మీద పోరాటం చేస్తున్నట్లుగా రాస్తున్నారని, ఇలా రాస్తున్న ఈనాడు పత్రికను ఏమనాలి? అది పేపరా? లేక పేపర్‌కు పట్టిన పీడనా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tags:    

Similar News