ఒక్క రోజులో మూడు ప్రమాదాలు

రెండు ప్రమాదలలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మూడో ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

Update: 2025-11-06 09:02 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నాడు మూడు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒక ప్రమాదంలో 16 మంది ప్రాణాపాయం నుంచి పడ్డారు. మరో ప్రమాదంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ఆ బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులకు ప్రాణాపాయం తప్పింది. అయితే మరో ప్రమాదంలో మాత్రం ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల రెండు రాష్ట్రాల్లో జరిగిన ఘోర ప్రమాదాల భయం వెంటాడుతోంది.  ఆంధ్రప్రదేశ్ లోని  కర్నూలు కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం,  తెలంగాణ చేవెళ్ల ఆర్టీసీ బస్సు టిప్పరు ప్రమాదాలు ఇప్పటికీ కళ్లముందు మెదులుతూనే ఉన్నాయి. దాదాపు 40  మంది ప్రాణాలు కోల్పోయిన ఈ రెండు ఘోర ఘటనల నుంచి రెండు రాష్ట్రాల ప్రజలు తేరుకోక ముందే వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటుండటం ఆందోళనకరంగా మారింది. 

బాపట్ల జిల్లా క్లాక్ టవర్ జంక్షన్ వద్ద గురువారం రోజు తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. వేగంగా వెళ్తున్న బైక్ ట్రక్‌తో ఢీకొట్టడంతో ఈ ప్రమాం చోటు చేసుకుంది. మృతులు గుంటూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. గుంటూరు జిల్లా కొరిటపాడుకు చెందిన షేక్‌ రిజ్వాన్, చింతల నాని సూర్యలంక బీచ్‌కు వెళ్లారు. అయితే సూర్యలంక బీచ్‌ మూసి వేయడంతో అక్కడ నుంచి బైక్‌పై తిరిగి బయలు దేరారు. గుంటూరుకు వస్తుండగా చీరాల నుంచి గుంటూరు వైపు వెళ్తున్న లారీ వెనుక భాగాన్ని వీరు ప్రయాణిస్తున్న బైక్‌ బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వేగంలో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు ఒక్క సారిగా ఎగిరి కిందపడి అక్కడికక్కడే స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పార్వతీపురం మన్యం జిల్లా పచ్చిపెంట మండలంలోని రొడ్డవలస ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం 7:45 గంటల సమయంలో ఒడిశా కు చెందిన ఆర్టీసీ బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన డ్రైవర్ ఇంజిన్ నుంచి పొగ రావడం గమనించి వెంటనే ఆపి అందరినీ సురక్షితంగా దింపాడు. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలో బయటపడ్డారు. 

నెల్లూరు జిల్లా పరిధిలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని మొచర్ల నేషనల్ హైవే వద్ద పెట్రోల్ బంక్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పెట్రోల్ బంక్ నుంచి జాతీయ రహదారిపైకి వచ్చిన ఆటోను వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టంతో ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 16 మంది గాయపడ్డారు. ఘటన సమయంలో ఆటోలో 13 మంది ప్రయాణికులు, కార్‌లో ముగ్గురు ఉన్నారు. గాయపడ్డ వారిని కావలి, ఉలవపాడు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. క్షతగాత్రులను కరేడు పంచాయతీ పరిధిలోని అలగైపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
Tags:    

Similar News