జగన్ ను డిస్క్వాలిఫై చేయాలి ఎమ్మెల్యే గంటా డిమాండ్
జగన్ ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటారని గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు;
మాజీ ముఖ్యమంత్రిజగన్ ను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.జగన్ రాజకీయాలలో వుండడానికి అనర్హుడని , ఎమ్మెల్యేగా కూడా డిస్ క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు.విశాఖలో మీడియాతో మాట్లాడుతూ జగన్ ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటారని మండిపడ్డారు. యోగాంధ్ర కు పేరు రాకూడదనే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగాపల్నాడు పరామర్శల టూర్ చేసి సింగయ్య మరణానికి కారణమయ్యారని విమర్శించారు.చనిపోయిన సింగయ్య మా పార్టీ వ్యక్తి, మీకేంటి బాధ అని జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మానవత్వం ఉంటే ఇప్పటికైనా సింగయ్య ఇంటికి వెళ్లి జగన్ క్షమాపణ చెప్పేవారని అలాకాకుండా ,నేను ఎప్పుడైనా గతంలో చంద్రబాబును, పవన్ ను ఇబ్బంది పెట్టానా అని ప్రశ్నించడం విడ్డూరంగా వుందన్నారు.
అధికారం వున్నప్పుడు చేసిన పనులు గుర్తులేవా అని ప్రశ్నించిన గంటా , ఆస్తి కోసం చెల్లిని, తల్లిని ఎలా ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరూ చూశారని గుర్తు చేశారు.జగన్ మాటలు చూస్తుంటే దెయ్యాల వేదాలు వల్లించినట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. 151 నుంచి 11కు ఎలా పడిపోయావో తెలుసుకోవాలని హితవుపలికారు.