ఏభై వసంతాల సినీ ప్రయాణంపై మెగాస్టార్ ఎమోషనల్ పోస్టు
మెగాస్టార్ చిరంజీవి తన నట ప్రస్థానాన్ని ఒక సారి గుర్తుకు చేసుకున్నారు. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పందించారు. ఆ పోస్టు వైరల్గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి తన సీనీ ప్రయాణంపై మరో సారి ఎమోషనలయ్యారు. తన సీనీ ప్రస్థానాన్ని ఒక సారి గుర్తు చేసుకున్నారు. నటన జీవితం ప్రారంభించి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇన్స్ట్రాగ్రామ్ వేదికగా చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తెలుగు సినీ ప్రేక్షకుల అకౌంట్లల్లో ఇది చక్కర్లు కొడుతోంది. ప్రస్థానానికి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓల్డెన్ డేస్ను, ఆ మెమోరీస్ను ఓ సారి రిమెంబర్ చేసుకుంటూ ఈ పోస్టును పెట్టారు. తొలి సారి రంగస్థలం మీద కాలు పెట్టిన సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. నర్సాపూర్ వైఎన్ఎం కాలేజ్లో డిగ్రీ చదువుకునే సమయంలో తొలి సారి స్టేజీ ఎక్కారు. తన తొలి రంగస్థల ప్రవేశం అక్కడే జరిగింది. రాజీనామా అనే తొలి నాటకం వేశానని, ఈ నాటకం ద్వారా తనకు నటుడిగా తొలి గుర్తింపు వచ్చిందని, అది తనను బెస్ట్ యాక్టర్ను చేయడంతో పాటు ఎనలేని ప్రోత్సాహాన్ని అందించిందని ఎమోషనల్గా ఫీలయ్యారు. 1974 –2024 వరకు తన 50 వసంతాల నట ప్రస్థానం..ఎనలేని ఆనందం అంటూ షేర్ చేసుకున్నారు. అప్పటి తన పాత ఫొటోను జోడించి పోస్టు చేయడం విశేషం. ఇప్పుడు ఈ పోస్టు మెగా అభిమానుల్లో తెగ చక్కర్లు కొడుతోంది.