గ్లోబల్ రేస్లో చేరడం కాదు..మనమే దారి చూపాలి
గ్లోబల్ లీడర్లు ,పెట్టుబడిదారులు తమతో కలసి పనిచేయాలని కోరిన లోకేష్;
By : V V S Krishna Kumar
Update: 2025-06-30 13:11 GMT
క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ వల్ల ఏపీ బ్రెయిన్ క్యాపిటల్గా మారుతోందని ఏపీ ఐటీ శాఖామంత్రి లోకేష్ అన్నారు.క్వాంటమ్ సైన్స్ను ఇంజనీరింగ్లోనూ భాగం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. టెక్నాలజీ పరంగా ఏపీ వేగంగా పనిచేస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా క్వాంటమ్ టెక్నాలజీ విప్లవం ప్రారంభం అవుతోందని ఉద్ఘాటించారు.విజయవాడలో జరిగిన క్వాంటం వర్క్షాప్ లో నారా లోకేష్ మాట్లాడారు.
క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అమరావతిని టెక్నాలజీ మ్యాప్లో చేర్చాలని లోకేష్ వ్యాఖ్యానించారు. క్వాంటమ్ వ్యాలీపై సీఎం చంద్రబాబు నాయుడు మొదటి టెక్నాలజీ రెవెల్యూషన్ను పరిచయం చేసినప్పుడు తాను ఏడోతరగతి చదువుకుంటున్నానని గుర్తుచేశారు .గ్లోబల్ రేస్లో చేరడం కాదు,మనమే దారి చూపాలని నారా లోకేష్ సూచించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు పెట్టిన ఐటీ రంగం విస్తృతిని గతంలో చూశామని, విజన్ అంటే ఇప్పుడు వెలాసిటీ , ఇన్నోవేషన్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.గ్లోబల్ లీడర్లు , పెట్టుబడిదారులు తమతో కలసి పనిచేయాలని కోరారు.
సౌత్ ఏషియా ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ఏర్పాటు అవుతోందని లోకేష్ ప్రకటించారు. అత్యాధునిక 156 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ను ఐబీఎం ఏర్పాటు చేస్తోందని స్పష్టం చేశారు. లక్షకు పైగా ఐటీ జాబ్స్ క్వాంటమ్ రంగంలో వస్తాయని ఆశిస్తున్నామని అన్నారు.సిలికాన్ వ్యాలీలాగా క్వాంటమ్ వ్యాలీ కూడా గ్లోబల్ సింబల్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.