శక్తి మేరకు ప్రాజెక్టులు కట్టుకుందాం: సీఎం చంద్రబాబు

నదుల్లో నీటిని ఏపీ, తెలంగాణ వాడుకోవడంలో గొడవలు వద్దని సీఎం చంద్రబాబు సూచించారు.;

Update: 2025-06-19 13:00 GMT

కృష్ణ, గోదావరి నదుల నీరు బోలెడంత సముద్రంలో కలిసిపోతోంది. ప్రాజెక్టులు కట్టుకోవడం ద్వారా ఆ నీటిని ఉపయోగించుకుందాం. ఈ మాత్రం దానికి తగాదాలు ఎందుకని తెలంగాణ సీఎం పేరు ఎత్తకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఏపీ సచివాలయంలో విలేకరులతో అన్నారు. నేను ఒకటే చెబుతున్నా.. గోదావరి నీళ్లను ఇరురాష్ట్రాలు వాడుకుంటున్నాయి. పోలవరం తప్ప మిగిలిన వన్నీ అనుమతి లేని ప్రాజెక్టులేనని గుర్తించాలని సీఎం అన్నారు.

నేను ఎప్పుడైనా తెలంగాణపై గొడవపడ్డానా? నదుల్లో నీటి వాడకంపై సమస్య సృష్టించడం ఎందుకు అని అన్నారు. మనం మనం కొట్టుకుంటే ఎవరికి లాభం? ఏపీ, తెలంగాణ ఎవరి శక్తిమేరకు వారు ప్రాజెక్టులు కట్టుకుందాం. కొత్త ట్రిబ్యునల్ వచ్చాక కేటాయింపుల్లో ఏమేరకు ముందుకెళ్లాలనేది ఆలోచిద్దాం అంటూ చంద్రబాబు మాట్లాడారు. కాళేశ్వరంపై నేను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు అని అన్నారు. కృష్ణాలోనే నీళ్లు తక్కువగా ఉంటాయి. గోదావరిలో ఎప్పుడూ నీరు పుష్కలంగా ఉంటుందని పేర్కొన్నారు.

Tags:    

Similar News