‘జగన్ ఒక నియంత’.. కాంగ్రెస్ గూటికి కిల్లీ కృపారాణి

వైసీపీకి రాజీనామా చేసిన కిల్లీ కృపారాణి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం జగన్‌ ఒక నియంతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-05 07:15 GMT


కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఇటీవల వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆమెను వైఎస్ షర్మిల.. పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్ జిల్లాలో కాంగ్రెస్ నిర్వహించిన బస్సు యాత్రలో భాగంగా కిల్లీ కృపారాణి, ఆమె భర్త రామ్మోహన్ రావు.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కృపారాణి మాట్లాడుతూ.. తనను వైసీపీ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జగన్, వైసీపీ కోసం ఎంతో కష్టపడ్డాను. ఉత్తరాంధ్రలో పార్టీని నిలబెట్టిన నేతను నేనే. అలాంటి నన్ను పక్కన పెట్టారు. నా మాటకు కూడా విలువ ఇవ్వలేదు. మాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి దేవుడితో సమానం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిందే. షర్మిల నాయకత్వంలో ఆంధ్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. జగన్ ఒక నియంత.. ఆయనను గద్దె దించితేనే రాష్ట్రం బాగుపడుతుంది’’అని ఆమె ధ్వజమెత్తారు.



Tags:    

Similar News