ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రమేశ్ ప్రమాణ స్వీకారం

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ రమేష్ చేత ప్రమాణం చేయించారు.

Update: 2025-10-17 08:40 GMT

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దొనాడి రమేశ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ రమేశ్ చేత న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు. జస్టిస్ రమేశ్ గతంలో ఏపి హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తూ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. తిరిగి ఆయన ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీ కావడంతో ఆయన చేత చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు. ఈకార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు సొలిసిటర్ జనరల్ ధనంజయ, అదనపు అడ్వకేట్ జనరల్ ఐ సాంబశివ ప్రతాప్, రిజిష్ట్రార్ జనరల్ వైవిఎస్బిజి పార్ధసారధి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.చిదంబరం, ఏపి బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎన్.ద్వారకానాధ్ రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్, పలువురు రిజిష్ట్రార్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:    

Similar News