5.78లక్షల కోట్ల పెట్టుబడులు–57.7గిగావాట్లు ఉత్పత్తి

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎనర్జీ ట్రాన్సిషన్‌ రోడ్‌ మ్యాప్‌పై ఏపీ ప్రభుత్వం–నీతి ఆయోగ్, ఐఎస్‌ఈజీ ఫౌండేషన్‌ మధ్య సీఎం చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది.;

Update: 2025-06-07 06:28 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని గ్రీన్‌ ఎనర్జీ హబ్‌గా మారుస్తామని చెబుతున్న కూటమి ప్రభుత్వం ఆ మేరకు శరవేగంగా అడుగులేస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్‌ ఎనర్జీని తెరపైకి తెచ్చింది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు ప్రత్యేకించి దీనిపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఇటీవల మంత్రి నారా లోకేష్‌ అనంతపురం జిల్లాలో రూ. 22వేల కోట్ల రెన్యూ ఇంటిగ్రేటెడ్‌ ఎనర్జీ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన కూడా చేశారు. పోయిన నెల 16న అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజక వర్గం బేతపల్లి గ్రామంలో రెన్యూ పవర్‌ సంస్థ స్థాపించనున్న రూ. 22వేల కోట్ల విలువైన 4.8 గిగావాట్ల హైబ్రిడ్‌ ఇంటిగ్రేటెడ్‌ ప్రాజెక్టుకు మంత్రి నారా లోకేష్‌ శంకుస్థాపన చేశారు. వీటిల్లో టాటాపవర్, ఎన్టీపీసీ, వేదాంత సెరెంటికా, ఎస్‌ఏఈఎల్‌ ఇండస్ట్రీస్‌ వంటి సంస్థలు గ్రీన్‌ ఎనర్జీని ఉత్పత్తి చేసేందుకు ముందుకొచ్చాయని వెల్లడించారు,

ఇలా కూటమి ప్రభుత్వం గ్రీన్‌ ఎనర్జీకి పెద్ద పీఠ వేసిన నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎనర్జీ ట్రాన్సిషన్‌ రోడ్‌ మ్యాప్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం–నీతి ఆయోగ్, ఐఎస్‌ఈజీ ఫౌండేషన్‌ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. క్లీన్‌ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇప్పటి దాకా రూ. 5.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో 57.7గిగావాట్ల ఉత్పత్తి కానుందని తెలుగుదేశం పార్టీకి చెందిన అధికారిక సోషల్‌ మీడియా
లో వెల్లడించారు.
ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యం 27.3 గిగావాట్లు ఉంది. 2029 నాటికి 78.50 గిగావాటల్ల సౌర విద్యుత్, 35 గిగావాట్ల పవన్‌ విద్యుత్, 22 గిగావాట్ల పంప్ట్‌ స్టోరేజ్, 2.5 గిగావాట్ల బ్యాటరీ స్టోరేజ్, 5వేల ఈవీ చార్చింగ్‌ స్టేషన్లు, 10వేల టీడీపీ బయో సీఎన్జీ–సీబీజీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ మేరకు ప్రణాళికలు కూడా రూపొందించామని అందులో పేర్కొన్నారు. 
Tags:    

Similar News