పరామర్శకు వెళ్తే కేసు పెడుతారా
మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కాకాణి గోవర్థన్రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.;
ఆంధ్రప్రదేశ్లో ప్రతి పక్ష పార్టీకి చెందిన నేతలపై కేసుల పర్వం కొనసాగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా మరో మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత కాకాణి గోవర్థన్రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తల చేత ఫిర్యాదులు ఇప్పించడం కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింది. నెల్లూరు జిల్లా కావలిలో ఈ కేసు నమోదైంది. కాకాణి గోవర్థన్రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కావలి అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని కోళ్లదిన్నె గ్రామానికి చెందిన ప్రసన్న కావలి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయశారు. బోగోలు మండలం కోళ్లదిన్నెలో పోలీసులుపై కాకాణి గోవర్థన్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రసన్న తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కాకాణి గోవర్థన్రెడ్డిపై కేసు నమోదు చేశారు.