ఏపీలో భిన్నమైన వాతావరణం

నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.;

Update: 2025-05-03 13:09 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని, బుధవారం వరకు ఈ పరిస్థితులు కొనసాగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు.

మే 4న ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కష్ణా,ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిగుడులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. సోమ, మంగళవారాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదన్నారు. బలమైన ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రతలు 41.5డిగ్రీల నుంచి 43డిగ్రీల మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు. శనివారం తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 42.8డిగ్రీలు, ప్రకాశం జిల్లా బోట్లగూడూరు 41.5డిగ్రీలు, పల్నాడు క్రోసూరు 41డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. 
ఎండ తీవ్రంగా ఉండి బయటకు వెళ్లేప్పుడు తలకు టోపి, కర్చీఫ్‌ కట్టుకోవాలి. గొడుగు ఉపయోగించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదన్నారు. శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని సూచించారు.
Tags:    

Similar News