తిరుమల పవిత్రత కోసం చంద్రబాబు అష్టాదశ నియమావళి

తిరుమలలో విఐపి కల్చర్ (VIP Culture) తగ్గించి, ప్రముఖులు వచ్చినపుడు హాడావిడి సృష్టించవద్దంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

By :  Admin
Update: 2024-10-05 04:39 GMT


 శనివారం టీటీడీ అధికారులతో పద్మావతి అతిథి గృహంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల పరిపాలన తీరు మీద  సమీక్ష జరిపారు.
దేవాదాయం మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో జె శ్యామలరావు , అదనపు ఈవో, వివిధ విభాగాల అధికారులు సమావేశానికి హాజరయ్యారు. తిరుమలను భక్తుల హృదయాలకు చేరువ చేసేందుకు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు సూచనలు చేశారు. అవేంటంటే...

1. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ఇక్కడ ప్రతిఒక్కరూ పనిచేయాలి.

2. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదు.

3. ప్రశాతంతకు ఎక్కడా భంగం కలగకూడదు...ఏ విషయంలోనూ రాజీ పడొద్దు.

4.  భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా చూసుకోండి...ముందస్తు ప్రణాళిక చాలా అవసరం.

5. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతంపైగా పెంచాలని అధికారులకు ముఖ్యమంత్రివర్యులు సూచించారు.

6. అటవీ సంరక్షణతో పాటు అడవుల విస్తరణ కోసం వచ్చే 5 ఏళ్లకు ప్రణాళికతో పనిచేయాలన్న సిఎం.

7. బయోడైవర్సీటీ పరిరక్షణకు ప్రాముఖ్యం ఇవ్వాలి.

8. టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకోవాలి.

9. వచ్చిన ప్రతి భక్తుడు తమ అనుభవాలపై అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలి.

10. భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలి.

11. ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలి. దీని మీదా మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి చర్యలు          తీసుకోవాలి.

12.  లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగింది అని భక్తులు చెపుతున్నారు....ఇది ఎల్లప్పుడూ, పూర్తిగా కొనసాగాలి...మరింత మెరుగుపడాలి.

13. ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడండి....అత్యుత్తమ పదార్థాలు మాత్రమే వాడాలి.

14.  తిరుమలలో విఐపీ సంస్కృతి తగ్గాలి. ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదు. సింపుల్ గా, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా అలంకరణ ఉండాలి. ఆర్భాటం, అనవసర వ్యయం వద్దు.

15. టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలి. దేశ విదేశాలనుంచి వచ్చేవారిని గౌరవించుకోవాలి. దురుసు ప్రవర్తన అనేది ఎక్కడా ఉండకూడదు. భక్తులు సంతృప్తితో, అనుభూతితో కొండ నుంచి తిరిగి వెళ్లాలి.

16. తిరుమల పేరు తలిస్తే....ఏడుకొండల వాడి వైభవం, ఆధ్యాత్మిక మాత్రమే చర్చకు రావాలి.

17. స్విమ్స్ సేవలు కూడా మెరుగుపరచాలి....ఇదొక ప్రత్యేకమైన క్షేత్రం. తిరుమల పవిత్రత కాపాడడం, ఆధ్యాత్మిక విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలి.

18. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థల సహకారంతో శ్రీవారి సేవ (స్వచ్చంద సేవను )మరింత బలోపేతం చేయాలి. తద్వారా భక్తులకు సేవకుల ద్వారా చక్కటి సేవలు అందించాలి.


Tags:    

Similar News