ప్రత్యేక విమానంలో ఆర్కే బీచ్‌కు నేడు సీఎం

విశాఖలో అంతర్జాతీయ యోగ దినోత్సవం ఏర్పాట్లను పరిశీలించనున్న సీఎం చంద్రబాబు.;

Update: 2025-06-16 04:02 GMT

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖపట్నం టూర్‌ చేయనున్నారు. ఈ సందర్భంగా విశాఖ సముద్ర తీరం ఆర్కే బీచ్‌లో జూన్‌ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగ దినోత్సవం ఏర్పాట్లను పరిశీలించనున్నారు. సీఎం చంద్రబాబు ఒక రోజు విశాఖ టూర్‌ సందర్భంగా యంత్రాంగ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మంత్రులు డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, పార్థసారథితో పాటు ఉత్తరాంధ్ర మంత్రులు ఆదివారమే విశాఖకు చేరుకుని సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.

సీఎం షెడ్యూల్‌ ఇదే..
సోమవారం ఉదయం తన ఉండవల్లి నివాసం నుంచి 10 గంటలకు గన్నవరం ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10:40 గంటలకు విశాఖకు చేరుకుంటారు. అక్కడ సుమారు పది నిముషాల పాటు టీడీపీ నేతలతో స్పెండ్‌ చేస్తారు. అనంతరం 10:50 గంటలకు బయలుదేరి నేరుగా విశాఖపట్నం ఆర్కే బీచ్‌లోని కాళీమాత గుడి వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి పార్క్‌ హోటల్‌ వరకు నిర్వహించే ఇంటర్‌నేషనల్‌ యోగా డే నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను చంద్రబాబు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఏర్పాట్లను పరిశీలించే పనిలోనే ఉంటారు. అనంతరం 12:05 గంటలకు నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుని అక్కడ 12:15 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అధికారులతో యోగా దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షిస్తారు. ఏ విధంగా ఏర్పాట్లు చేయాలో అధికారులకు దిశా నిర్థేశం చేస్తారు.
అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశం ఉంటుంది. మధ్యాహ్న 2:30 గంటల ప్రాంతంలో నోవాటెల్‌ హోటల్‌ నుంచి బయలుదేరి 2:50 గంటలకు సీఎంపాలెంలోని వైజాగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. యోగా దినోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపైన ఆయన టీడీపీ శ్రేణులకు దిశా నిర్థేశం చేయనున్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వంటి అంశాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపైన టీడీపీ శ్రేణులకు దిశానిర్థేశం చేయనున్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఇంటికి చేరుకుంటారు. ఇటీవల ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సంహాచలం మరణించిన సందర్భంగా పల్లా కుటంబాన్ని పరామర్శించనున్నారు. అది పూర్తి అయిన తర్వాత విశాఖ ఎయిర్‌పోర్టుకు వెళ్లి అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్టుకు పయనమవుతారు. అక్కడ నుంచి ఉండవల్ల నివాసానికి చేరుకుంటారు.
Tags:    

Similar News