బీహార్ రెండో దశ పోలింగ్ మొదలు
దాదాపు 3.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఈదశ పోలింగ్ లో వినియోగించుకోనున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ, చివరి దశ పోలింగ్ మంగళవారం (నవంబర్ 11) ప్రారంభమైంది. ఇది నితీష్ కుమార్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు సహా 1,302 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే కీలక దశ.
నేపాల్ తో సరిహద్దులను పంచుకునే పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సీతామడి , మధుబని, సుపాల్, అరారియా కిషన్గాంజ్ తదితర జిల్లాల్లోని 122 నియోజకవర్గాలలో దాదాపు 3.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఈదశ పోలింగ్ లో వినియోగించుకోనున్నారు.
బీహార్ ఎన్నికలో ప్రతి ఒక్కరూ తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో చురుగ్గా పాల్గొనాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ రామ్ కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థ డీజిల్-పెట్రోల్పై ఆధారపడి ఉంది. డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతున్నప్పుడు, దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది. ప్రతి ఒక్కరూ ప్రయాణించడానికి వాహనాలను ఉపయోగిస్తారు. కానీ ఈ-రిక్షా వంటి చిన్న రవాణా మార్గాలను ఉపయోగించాలి. ఇది కాలుష్యాన్ని అరికట్టడంలో కూడా సహాయపడుతుంది. ప్రజలు శాంతియుతంగా ఓటు వేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ప్రజాస్వామ్య పండుగ. ఈ పండుగను ఆస్వాదిస్తూ, మీ ప్రభుత్వాన్ని ఎన్నుకోండి’’ అని ఆయన కోరారు.
జన్ సూరాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగీ పీకే మాట్లాడుతూ.. "ఓటింగ్ నెమ్మదిగా జరగడం లేదు. స్వాతంత్య్రం తర్వాత, ఈ ఎన్నికల మొదటి దశలో రాష్ట్రంలో గరిష్ట ఓటింగ్ జరిగిందని బీహార్ ఓటర్లు చూపించారు. ఈ రోజు ఓటర్ల సంఖ్య 65% మించి ఉంటుందని, కొత్త రికార్డును సృష్టిస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ ఓటు మార్పు తీసుకురావడానికి మరియు యువతకు విద్య మరియు ఉపాధిని నిర్ధారించడానికి. నవంబర్ 14 తర్వాత, బీహార్లోని ఏ యువకుడూ రూ. 10,000-14,000 సంపాదించడానికి రాష్ట్రం విడిచి వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆశిస్తున్నాము. ప్రజలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేస్తున్నారు" అని తెలిపారు.
‘‘ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నా. బీఆర్ఎస్ ఇప్పుడు కూడా కొంత తప్పుడు ప్రచారం చేస్తోంది. యువత బయటికి రాట్లేదన్నది అవాస్తవం. ఓటర్ల నుంచి మాకు మంచి స్పందన లభిస్తోంది’’ అని నవీన్ యాదవ్ పేర్కొన్నారు.
ఉదయం 9 గంటల వరకు బీహార్ రెండో దశ పోలింగ్లో 14.55శాతం ఓటింగ్ నమోదయింది.
బీహార్లో రెండో దశ పోలింగ్ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలంతా కూడా బీహార్ ఆర్థికాభివృద్ధికి ఓటు వేయాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కోరారు. ‘ప్రస్తుతం బీహార్కు సామాజిక న్యాయం, సమానత్వంతో నిండిన ‘నమూనా’ అవసరం’’ అని ఓటర్లకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పిలుపునిచ్చారు.
బీహార్ పోలింగ్లో పెరుగుతున్న ఓటింగ్ పర్సింటేజీ పెరుగుతున్న అవగాహనను స్పష్టంగా సూచిస్తుందని లోక్జనశక్తి పార్టీ ఎంపీ రాజేశ్ అన్నారు. ‘బీహార్ ప్రజలు తమ ఓటును ఎలా తెలుసుకుంటున్నారు మరియు సరిగ్గా ఉపయోగించుకుంటున్నారు, ఇది మెరుగైన మరియు అభివృద్ధి చెందిన బీహార్కు పునాది వేస్తోంది. దీనికి అందరికీ ధన్యవాదాలు. అందరి సమిష్టి కృషి కారణంగా, రెండవ దశ ఎన్నికలు పూర్తిగా ప్రశాంతంగా జరుగుతున్నాయి" అని ఆయన తెలిపారు.
బీహార్ రెండవ దశ ఓటింగ్పై ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా స్పందించారు. ఈసారి పెద్ద మార్పుగా కనిపిస్తోందని అన్నారు. "మొదటి దశలో మన తలుపులు తట్టిన మార్పు ఇప్పుడు పెద్ద మార్పుగా మారుతోంది... ప్రధానమంత్రి, హోంమంత్రి, UP ముఖ్యమంత్రి, లెక్కలేనన్ని ఇతర మంత్రులు బీహార్లో ఉద్యోగాలు, వలసలు లేదా సామాజిక భద్రత గురించి ఎవరూ చర్చించకుండా ఉండటానికి తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ బీహార్ దాని పిచ్ నుండి వైదొలగలేదు... ఈ పిచ్ నవంబర్ 14న మరింత బలోపేతం అవుతుంది. నవంబర్ 18న ఏమి జరిగినా అది జరుగుతుంది" అని అన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్లో ఉదయం 9 గంటల వరకు 14.55% పోలింగ్ నమోదైంది.
బీహార్ ఎన్నికల పోలింగ్ సందర్బంగా ప్రతిపక్షాలపై కేంద్రమంత్రి సతీష్ చంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాళ్లకి ఆరోపణలు చేయడం తప్ప మరో సమస్య లేదని అన్నారు. ‘‘ప్రజలు NDA కూటమికి ఓటు వేస్తున్నారు. 100% NDA మరియు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడబోతోంది. ప్రజలందరూ తమ పిల్లల భవిష్యత్తు కోసం, వారి దేశం మరియు రాష్ట్ర భవిష్యత్తు కోసం NDAకి అనుకూలంగా ఓటు వేయాలని మేము కోరుతాము" అని అన్నారు.
బీహార్ రెండో దశ పోలింగ్ సందర్బంగా ప్రతి ఓటరు కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని బీహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ కోరారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. "ఈరోజు చివరి దశ పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుండి దాదాపు అందరు NDA అభ్యర్థులతో మాట్లాడే అవకాశం నాకు లభించింది. చుట్టూ చాలా సానుకూల వాతావరణం ఉంది. ఓటర్లు ఖచ్చితంగా ఓటు వేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను" అని అన్నారు.