ఇస్లామిస్టుల కొత్త కూటమి భారత్ ను ప్రమాదంలోకి నెడుతుందా?

ఢాకాలో పరిస్థితులన్నీ న్యూఢిల్లీకి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. చాలాకాలంగా హసీనా పాలనలో తమ ప్రాభావాన్ని కోల్పోయిన ఇస్లామిక్ గ్రూపులు చర్చలు ప్రారంభించాయి.

By :  47
Update: 2024-09-09 08:32 GMT

మన పొరుగు దేశం బంగ్లాదేశ్ లో మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసిన తరువాత అక్కడి పరిస్థితులు మొత్తం క్షీణించాయి. చాలా కాలంగా ఎక్కడోక్కడో తలదాచుకున్న ఆమె ప్రత్యర్థులు ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చి తమ శక్తియుక్తులను కూడదీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

మారిన పరిస్థితులలో, బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరిగినప్పుడు తమ బలాన్ని పెంపొందించుకోవడానికి, తమను తాము సిద్ధం చేసుకోవడానికి అనేక మంది కొత్త భాగస్వాముల కోసం వేటాడటం, భావసారూప్యత గల పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వంటి చర్యలకు తెరతీశారు.
ఒకే బ్యానర్ కింద
నిజానికి బంగ్లాదేశ్ తనను తాను సెక్యులర్ దేశంగా ప్రకటించుకుంది. కానీ షేక్ హసీనాను దించిన ఇస్లామిక్ శక్తులు దేశంలో కఠినమైన షరియా చట్టాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నాయి. అందులో ఇప్పుడు అనేక రాజకీయా పార్టీలు ఐక్యంగా దీనిని అమలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇప్పుడు హసీనా రాజకీయ రంగానికి దూరంగా ఉండటంతో, ఇతర రాజకీయ నాయకులు వారి ఎజెండా ప్రకారం బంగ్లాదేశ్‌ను రూపొందించడానికి పూనుకుంటున్నారు. వీరి లక్ష్యం ఒక్కటే దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడం.
ప్రధాన చొరవ
దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడానికి ప్రధానంగా రెండు పార్టీలు చొరవ తీసుకుంటున్నాయి. వాటిలో ప్రధానమైంది జమాతే ఏ ఇస్లామి బంగ్లాదేశ్. దీనితో పాటు ఇస్లామీ ఆండోలోన్ లు చేతులు కలుపుతున్నాయి. జమాతే ఇస్లామీ చరిత్ర చూస్తే ఇది పాకిస్తాన్ కు పూర్తిస్థాయిలో మద్ధతు తెలిపి, వేలాది మంది బంగ్లాదేశీయులను 1971 లో ఊచకోత కోసింది. స్వాత్రంత్యం వద్దని బంగ్లాలో ప్రచారం చేసింది.
ఈ రెండు పార్టీలు గత వారం రోజులుగా వరుస సమావేశాలు నిర్వహించి బంగ్లాదేశ్‌లోని ఇతర ఇస్లామిస్ట్ పార్టీలతో ప్రతిపాదిత ఐక్య ఫ్రంట్‌ను రూపొందించే ఉద్దేశ్యంతో చర్చలు జరిపాయి.
బెంగాలీ జాతీయ దినపత్రిక కలేర్ కొంటోలో ఒక నివేదిక ప్రకారం, ఆగస్ట్ 20న జమాతే ఇస్లామీ అమీర్ డాక్టర్ షఫీకర్ రెహమాన్ ఇతర ఆరు ప్రధాన స్రవంతి ఇస్లామిస్ట్ పార్టీలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి వారితో సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఖిలాఫత్ ఆందోళన్, బంగ్లాదేశ్ ఖిలాఫత్ మజ్లిస్, జమాత్-ఎ-ఉలేమా-ఇస్లాం బంగ్లాదేశ్, ఖిలాఫత్ మజ్లిస్ వంటి ఇతర పార్టీలతో ఐక్య ఫ్రంట్ కోసం చర్చలు జరుగుతున్నాయి. అనేక ఇతర చిన్న ఇస్లామిస్ట్ పార్టీలు కూడా ఒకే బ్యానర్ క్రిందకు సారూప్యత కలిగిన పార్టీలన్నింటినీ తీసుకువచ్చే ప్రయత్నంలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నాయి.
హసీనా హయాంలో...
గతంలో, బంగ్లాదేశ్‌లోని రెండు ప్రధాన పార్టీలు, అవామీ లీగ్, దాని ప్రత్యర్థి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) జమాత్-ఎ-ఇస్లామీ, ఇతర ఇస్లామిస్ట్ పార్టీలను తమ ప్రభుత్వాలలో సంకీర్ణ భాగస్వాములుగా చేర్చుకున్నాయి. అయితే గతంలో జరిగిన అన్ని ప్రధాన నిరసనల సమయంలో వీధి పోరాటాలు అందించడానికి సాంప్రదాయకంగా జమాత్‌ను ఉపయోగించుకునే BNP కంటే ఇస్లాంవాదుల పట్ల హసీనా వైఖరి కఠినంగా ఉంది.
బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు, హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ జమాతే ఏ ఇస్లాం ను నిషేధించారు. అయితే బంగ్లాదేశ్ లో 1975 లో సైనిక తిరుగుబాటు జరిగి షేక్ ముజిబుర్ రెహమాన్ ఆయన కుటుంబంతో సహ హత్య చేయబడ్డారు. కేవలం షేక్ హసీనా, తన చెల్లి మాత్రమే ఇందులో మిగిలారు.
తరువాత బంగ్లాదేశ్ లో అధికారంలోకి వచ్చిన బీఎన్పీ నేతృత్వంలోని జియావుర్ రెహమాన్ సర్కార్ జమాతే ఇస్లామ్ ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. పాముకు పాలు పోసి పెంచే ప్రయత్నం చేశారు. జియావుర్ రెహమాన్ కూడా 1981లో హత్య చేయబడ్డాడు. ప్రస్తుతం అతని భార్య ఖలీదా జియా తన కుమారుడు తారిఖ్ రెహమాన్‌తో కలిసి పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు.
హసీనా కొన్ని ఇస్లామిస్ట్ పార్టీలతో పొత్తు కొనసాగించినప్పటికీ, జమాత్, ఇతర ప్రధాన సమూహాలు విపరీతమైన ఒత్తిడికి లోనయ్యాయి. ఆమె పాలనలో బంగ్లాదేశ్ భూభాగంలో ఇస్లామిక్ మూకలు పూర్తి ప్రాధాన్యం లేని సంస్థలుగా మారిపోయాయి.
పునరాగమనాన్ని ప్రదర్శిస్తోంది
ఇప్పుడు హసీనా నిష్క్రమణతో, వారందరూ దేశ రాజకీయ కేంద్రానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. అయితే గతంలో మాదిరిగా కాకుండా, బంగ్లాదేశ్ భవిష్యత్తు, ఉమ్మడి రాజకీయ, సామాజిక ఎజెండా గురించి ఒకే విధమైన అభిప్రాయాన్ని పంచుకునే అన్ని ఇస్లామిస్ట్ పార్టీలు ఇప్పుడు BNP లేదా అవామీ లీగ్‌తో కాకుండా ఒకదానితో ఒకటి పొత్తు పెట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి.
దేశంలో హసీనా వ్యతిరేక సెంటిమెంట్లు ఇప్పటికీ చాలా బలంగా ఉన్నందున, ప్రధాన ఇస్లామిస్ట్ పార్టీలు గత ఎన్నికల్లో అవామీ లీగ్తో పొత్తు పెట్టుకున్న వారిని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాయి. 44 కంటే ఎక్కువ రాజకీయ పార్టీలను బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం గుర్తించింది, వాటిలో 11 ఇస్లామిస్ట్ పార్టీలు, సంస్థలు ఉన్నాయి. కానీ దేశంలో దాదాపు 70 ఇస్లామిస్ట్ పార్టీలు వివిధ పరిమాణాలు, సంస్థాగత సామర్థ్యాలను కలిగి ఉన్నాయి.
ఇస్లామిక్ రాజ్యం కోసం మహా కూటమి
గత 50 ఏళ్లుగా రాజకీయ, సైద్ధాంతిక విభేదాల కారణంగా ఒక్కటవ్వలేకపోయారు. కానీ ఇప్పుడు పెద్ద ఇస్లామిస్ట్ పార్టీల మధ్య ఉన్న ప్రయత్నమేమిటంటే, తమ విభేదాలను పరిష్కరించుకోవడం, బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ స్టేట్‌ను సృష్టించడానికి సమాన ఆలోచనలు ఉన్న పార్టీలన్నింటినీ కలిపి ఒక మహా కూటమిని ఏర్పాటు చేయడం.
"మా" అనైక్యత కారణంగా వారు గత 15 సంవత్సరాలుగా "ఫాసిస్ట్ పాలన" నుంచి అణచివేతకు, హింసకు గురయ్యారని ఇస్లామీ ఆండోలోన్ పార్టీ ప్రధాన కార్యదర్శి యూనస్ అహ్మద్ కలేర్ కొంతోతో అన్నారు. “ఇస్లామిక్ స్టేట్‌ను రూపొందించడానికి, మా విభేదాలను ముగించడానికి చర్చలలో చేరాలని మేము అందరినీ ఆహ్వానించాము. నిజమైన ఇస్లామిక్ రాజకీయ నిర్మాణాన్ని సృష్టించడం మా ఏకైక లక్ష్యం, ” అని అహ్మద్ ఎత్తి చూపారు.
భారత్‌కు సవాల్‌
ఇస్లామిక్ పార్టీల మధ్య ప్రస్తుత చర్చలు రాబోయే రోజుల్లో ఎలా పురోగమిస్తాయో స్పష్టంగా లేదు. చిల్లర శత్రుత్వం, సైద్ధాంతిక విభేదాలు అని పిలవబడే వాటిని ఇప్పటివరకు దూరంగా ఉంచారు. ఐక్యత కోసం గతంలో చర్చలు జరిగినప్పటికీ వారు కలిసి రాలేకపోయారు.
అయితే, గత 15 ఏళ్లలో వారు హసీనా ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిళ్లతో రాజకీయాల నుంచి దూరమయ్యారు. ఇది వారి భవిష్యత్తు వ్యూహాన్ని పాజ్ చేయడానికి, మళ్లీ ఆలోచించడానికి వారికి సమయం ఇచ్చి ఉండవచ్చు.
ఇది భవిష్యత్తులో అన్ని ఇస్లామిస్ట్ పార్టీల మధ్య మహా కూటమికి దారితీస్తుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు కానీ ప్రస్తుత సమిష్టి ప్రయత్నం ఖచ్చితంగా న్యూఢిల్లీలోని విధాన ప్రణాళికదారులకు కొత్త ఆందోళనను తీసుకొస్తుంది.
అస్థిర వాతావరణం
హసీనా నిష్క్రమణ, బంగ్లాదేశ్‌లోని మతపరమైన మైనారిటీలపై దాడుల సంఘటనలు భారతదేశంలో తీవ్ర ఆందోళన కలిగించాయి. సోషల్ మీడియాలో కొన్ని బలమైన బంగ్లాదేశీ వ్యతిరేక వ్యాఖ్యలకు దారితీశాయి. ఇది గత వారాల్లో రెండు దేశాల మధ్య నెలకొన్న అస్థిరత, అనిశ్చితి వాతావరణానికి తోడు తీసుకొచ్చాయి.
కానీ హసీనా యొక్క తెలివిగల నిర్వహణ, పరిపాలనపై పూర్తి నియంత్రణ అటువంటి వ్యాఖ్యలు దారిలో నిలబడకుండా, ఇండో-బంగ్లాదేశ్ సంబంధాలలో పురోగతిని దెబ్బతీసేలా చేసింది. ఇప్పుడు, బంగ్లాదేశ్‌లో రూపాంతరం చెందిన రాజకీయ వాతావరణంలో, భారతదేశంలో అలాంటి సంఘటన ఏదైనా పొరుగు దేశంలో పెద్ద ప్రభావాన్ని చూపడమే కాకుండా వ్యవహరాల్లో మార్పులకు కారణమవుతుంది. అది కూడా వ్యతిరేకంగానే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత్ కూడా పొరుగున ఉన్న దేశాలతో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఢాకాతో సాధ్యమైనంత వరకూ సంబంధాలను సాధారణ చేసేందుకు ప్రయత్నించాలి.


Tags:    

Similar News