నేను మైనారిటీలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు: ప్రధాని

మైనారిటీలకు వ్యతిరేకంగా తాను ఒక్కమాట కూడా మాట్లాడలేదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా..

Update: 2024-05-20 08:25 GMT

తాను మైనారిటీలకు వ్యతిరేకం కాదని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా మైనారిటీలకు వ్యతిరేకం కాదని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా 400 పైగా స్థానాలను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

'మైనారిటీలకు వ్యతిరేకంగా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడుతున్నాను. కాంగ్రెస్, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తోంది, అదే నేను చెబుతున్నాను,” అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని అన్నారు.
ప్రధాని మోదీ గతంలో పలు సందర్భాలలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించి, వీటివల్ల మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలు తీవ్ర అభద్రతా భావంతో ఉన్నారని విలేకరి ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు ప్రధాని స్పందించారు. బీజేపీ ఎప్పుడు ముస్లింలు, మైనారిటీలకు వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు.
'ప్రత్యేక పౌరులను అంగీకరించలేం'
ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై విరుచుకుపడిన మోదీ, ఆ పార్టీ రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తిని నిరంతరం ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఓటు బ్యాంకు రాజకీయాలతో మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష పార్టీల ఉద్దేశాలను బట్టబయలు చేయడమే తన ప్రచార ప్రసంగాల లక్యమని అన్నారు.
మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండవని భారత రాజ్యాంగ నిర్మాతలు బీఆర్ అంబేద్కర్, జవహర్‌లాల్ నెహ్రూలు నిర్ణయించారని అన్నారు. "ఇప్పుడు మీరు వాటిని ఉల్లంఘిస్తున్నారు. వాటిని బహిర్గతం చేయడం నా బాధ్యత. ఆ సమయంలో రాజ్యాంగ సభలో నా పార్టీ సభ్యులు ఎవరూ లేరు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖుల సభ." అని మోదీ అన్నారు.
కాంగ్రెస్ బుజ్జగింపు మార్గాన్ని అనుసరిస్తుంటే, “నేను సంతృప్తి మార్గాన్ని అనుసరిస్తున్నాను. మేము 'సర్వ ధర్మ సంభవ'ని నమ్ముతాము. అందరినీ మాతో పాటు తీసుకెళ్లాలన్నారు. మేము ఎవరినీ ప్రత్యేక పౌరులుగా అంగీకరించడానికి సిద్ధంగా లేము, అందరినీ సమానంగా పరిగణిస్తాం, ”అని ఆయన అన్నారు.
దక్షిణాదిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా..
బీజేపీ దక్షిణ భారతంలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 4న బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) 400 లోక్‌సభ స్థానాలను కూడా గెలుచుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
“ దేశం మొత్తానికి మా వ్యూహం ఒకటే. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్. ఔర్ చార్ జూన్ 400 పర్” అని మోదీ ఆదివారం రాత్రి ఇంటర్వ్యూలో అన్నారు. 2019లో లాగా దక్షిణాదిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆయన అన్నారు. “మేము ఇప్పటికే మైండ్-షేర్‌లో జంప్‌ని చూశాము. రీజియన్‌లో మాకు సీట్ల వాటా, ఓట్ల వాటాలో పెద్ద పెరుగుదలను చూస్తాము,” అని సమాధానమిచ్చారు.
రాజ్యాంగాన్ని కాంగ్రెస్‌ అవమానించింది..
లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ 400 సీట్లకు పైగా గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లను తొలగిస్తారనే ప్రతిపక్షాల వాదనను మోదీ తోసిపుచ్చారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, OBC నేపథ్యాల నుంచి అత్యధిక సంఖ్యలో మంత్రులను నియమించిన పార్టీ బిజెపి అని ఆయన అన్నారు. ముస్లిం రిజర్వేషన్ అంశంపై, మత ప్రాతిపదికన కోటా అంశాన్ని, రిజర్వేషన్ల అంశాన్ని కలపడం సరికాదన్నారు. “రాజ్యాంగం, దాని రూపకర్తలు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కోరుకోలేదు,” అని ఆయన అన్నారు.
‘‘అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్లను పలుచన చేసి, మత ప్రాతిపదికన ఇచ్చి, రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెస్సే. జాతీయ స్థాయిలో కూడా చేయాలనుకుంటున్నారు. నేను దానిని ఎప్పటికీ జరగనివ్వనని చాలా స్పష్టంగా చెప్పాను,” అని అన్నారాయన.
ప్రభుత్వాలను గద్దె నుంచి దించడం, భారత రాజ్యాంగాన్ని పక్కదారి పట్టించడం వంటి దుశ్చర్యలకు ఒక నిర్ధిష్ట రాజవంశం పాల్పడిందని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబాన్ని ఉద్ధేశించి విమర్శలు గుప్పించారు. "ఇప్పుడు, ఈ రాజవంశపు తాజా తరం వారి పూర్వీకుల వారసత్వాన్ని ఉపయోగించాలనుకుంటోంది. వారు చరిత్రలో ఇలాంటి నల్ల మచ్చలు చాలా ఉన్నాయని చూస్తున్నారు. ఈ నల్ల మచ్చలను తొలగించడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, ప్రతి ఒక్కరినీ అప్రజాస్వామికమని నిందించడం, " అని మోదీ విమర్శించారు.
రాజ్యాంగాన్ని ప్రశంసించారు
ఇంటర్వ్యూలో, ప్రధానమంత్రి రాజ్యాంగాన్ని ఆత్మీయంగా ప్రశంసించారు, తనలాంటి సామాజిక-ఆర్థిక నేపథ్యం ఉన్న వ్యక్తి అది లేకుండా ఇంత దూరం రాలేరని అన్నారు. “మోదీ.. బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగపు శక్తి ద్వారా తయారు చేయబడ్డారు. నేను దేశ ప్రయోజనాల కోసమే పనిచేశాను. రాజ్యాంగ సంక్షేమంలోనే మోదీ సంక్షేమం ఉంది’’ అని పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్ల అంశంపై ప్రతిపక్షాల ఆరోపణను తిప్పికొట్టిన ఆయన, అటువంటి సామాజిక నేపథ్యాల నుంచి అత్యధిక సంఖ్యలో ఎంపీలు ఉన్న పార్టీ బీజేపీ అని అన్నారు.
‘దేశానికి దళిత, గిరిజన రాష్ట్రపతిని అందించిన పార్టీ ఏది.. అది బీజేపీ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల విషయంలో మేమేదైనా చేస్తామని ప్రతిపక్షాలు చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.
Tags:    

Similar News