భారత్- కెనడా సంబంధాలు సిక్కు సమాజాన్ని ఏం చేశాయంటే..?

భారత్- కెనడా మధ్య మొదలైన దౌత్య ఘర్షణ సిక్కు సమాజంలో తీవ్రమైన అలజడికి గురి చేసిందని ఉత్తర అమెరికాలోని సిక్కు సమాఖ్య తెలిపింది.

By :  491
Update: 2024-10-18 10:03 GMT

భారత్ - కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం సిక్కు డయాస్పోరాలో అభద్రత భావంతో పాటు విభజనలను మరింతగా పెంచిందని ఉత్తర అమెరికా పంజాబీ అసోసియేషన్ (NAPA) శుక్రవారం వెల్లడించింది. గత ఏడాది జూన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు ప్రధాన కారణం భారత ప్రభుత్వ ఏజంట్లే కారణమని, దానితో పాటు దౌత్య సిబ్బంది ప్రమేయం ఉందని కెనడా ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం ముదిరింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. కెనడా ఆరోపణలు పూర్తిగా కల్పితం అని ఎదురుదాడికి దిగింది.

ఈ హత్య, దౌత్యపరమైన సంఘర్షణ సిక్కు వలస కుటుంబాలు వారి గుర్తింపులు, రాజకీయ విశ్వాసాలు, సామాజిక పరస్పర చర్యలను ,చాలా ప్రభావితం చేశాయని NAPA ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నామ్ సింగ్ చాహల్ తెలిపారు.
Tit-for-tat బహిష్కరణలు
భారత్ ఈ వారం ఆరుగురు కెనడియన్ దౌత్యవేత్తలను బహిష్కరించింది. నిజ్జర్ హత్యకు సంబంధించిన దర్యాప్తుతో రాయబారిని కూడా అనుమానితుల జాబితాలో చేర్చడానికి ఇచ్చిన సమాచారంతో భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. వెంటనే ఒట్టావాలో ఉన్న హైకమిషనర్ ను ఉపసంహరించుకుంది. ఆ తరువాత కెనడా రాయబారులను దేశం విడిచివెళ్లాల్సిందిగా న్యూఢిల్లీ ఆదేశించింది. 48 గంటల్లో దేశం నుంచి వెళ్లిపోవాలని సూచించింది. అంతకుముందు కెనడా హైకమిషనర్ ను పిలిపించి చాలా గట్టి భాషలో తన నిరసన తెలియజేసింది.
చండీగఢ్‌లో చాహల్ మాట్లాడుతూ, నిజ్జర్ హత్య సిక్కు డయాస్పోరాలో ఇప్పటికే ఉన్న విభేదాలను మరింత తీవ్రతరం చేసిందని అన్నారు. కొంతమంది కమ్యూనిటీ సభ్యులు కెనడియన్ ప్రభుత్వ వైఖరిని మానవ హక్కుల చట్టబద్ధమైన రక్షణగా భావిస్తుండగా, మరికొందరు దీనిని భారతదేశ సార్వభౌమాధికారానికి అవమానంగా భావిస్తున్నారని చెప్పారు.
సిక్కుల మధ్య విభజన
ఈ పోలరైజేషన్ కుటుంబాలు, సామాజిక వర్గాల్లో చీలికలకు దారితీస్తుందని, హాట్ చర్చలు, ఘర్షణలు, దూరాలకు దారితీస్తుందని ఆయన అన్నారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ప్రమేయం, రాజకీయ హింసకు సంబంధించిన ఆరోపణలు చాలా మంది సిక్కులలో భయాన్ని కలిగించాయని, ముఖ్యంగా వారి రాజకీయ విశ్వాసాల గురించి గళం విప్పడానికి కారణం అయిందని ఆయన అన్నారు.
సాధారణ కుటుంబాలు తమ అభిప్రాయాలను భారత్ లక్ష్యంగా చేసుకోవడం గురించి ఆందోళన చెందుతున్నాయి. ఇది సమాజంలో స్వేచ్ఛా వ్యక్తీకరణపై చిల్లింగ్ ఎఫెక్ట్‌కు దారి తీస్తుందని చాహల్ చెప్పారు.
ద్వంద్వ గుర్తింపు సంక్షోభం
అలాగే, సిక్కు కుటుంబాలు నాన్-సిక్కు ఇరుగు పొరుగువారు, స్నేహితులతో సంక్లిష్ట సంబంధాలను ఎదుర్కొనే అవకాశం ఉందని అన్నారాయన. చాలా మంది సిక్కులు తమ ద్వంద్వ గుర్తింపుతో పోరాడుతున్నారని, కెనడియన్లు, చారిత్రాత్మకంగా అట్టడుగు వర్గానికి చెందిన సభ్యులుగా ఉన్నారని చాహల్ చెప్పారు. నిజ్జర్ హత్య వంటి సంఘటనల నుంచి ఉత్పన్నమయ్యే బాహ్య ఒత్తిళ్లు, ప్రతికూల మూస పద్ధతులతో కూడి ఉంటుంది, ఇది కెనడియన్ సమాజానికి వారి సహకారాన్ని కప్పివేస్తుందని చాహల్ అభిప్రాయపడ్డారు.
తమ పక్షం వహించాలని ఒత్తిడి
సిక్కు డయాస్పోరాలో, రాజకీయ కథనంలో పక్షం వహించడానికి గణనీయమైన ఒత్తిడి ఉంటుందని ఆయన అన్నారు. కొంతమంది సిక్కు కార్యకర్తలు నిజ్జర్ల కారణానికి సంఘీభావం తెలపవచ్చు. మరికొందరు భారతదేశంతో సత్సంబంధాలు కొనసాగించడానికి జాగ్రత్త వహించాలని కోరవచ్చు. భారత్ తో సంబంధాలు కోరుకునే వారికి ఇది కొంచెం క్లిష్ట పరిస్థితిని సృష్టించిందనే చెప్పాలి.



Tags:    

Similar News