టాలీవుడ్లో మారుతున్న లెక్కలు.. చుక్కలు చూసేదెవరో..
నిర్మాతల కొత్త లెక్కలకి హీరోల ఒప్పుకుంటారా?;
ఇండస్ట్రీలోని స్ధబ్దతను బ్రేక్ చేయాలంటే – ఇక నిర్మాతలే గేమ్ను రీడిజైన్ చేయాల్సిన సమయం వచ్చేసింది. గత కొంతకాలంగా తెలుగు సినిమా పరిశ్రమ భారీ కుదుపులకు లోనువుతోంది. ఈ క్రమంలో స్థాయిలో మార్పుల దశలో ఉంది. సూపర్స్టార్ల రెమ్యునరేషన్లు, ఓటిటి మార్కెట్ సంక్షోభం, థియేటర్లలో రానున్న రిస్క్– బడ్జెట్- కలెక్షన్స్ లో అసమతుల్యత, ఇలా ప్రతీ స్థాయిలో ఒత్తిడి పెరుగుతోంది.
సైలెంట్ గా తమ పని తాము చేసుకుపోతున్న నిర్మాతలు సైతం ఇప్పుడు తలెత్తి ఆలోచనలో పడుతున్నారు. "ఇలా కుదురదు!" అని బాహాటంగా చెబుతున్నారు. కేవలం సినిమాల హిట్ కోసం కాదు, కూలిపోతున్న ఈ వ్యవస్థ తిరిగి నిలదొక్కుకోవటం కాస్టింగ్ నుంచి పేమెంట్స్ దాకా ప్రతి దశలో మార్పు అవసరం అనే చర్చ ఇండస్ట్రీ హాల్లలో, ప్రెస్ మీట్లలో, ఫంక్షన్ల స్టేజీలపై బలంగా వినిపిస్తోంది.
పైకి కనపడినంత అందంగా,ఆనందంగా ఏ నిర్మాతా లోపల లేరు. ప్రతీ ప్రొడక్షన్ సంస్దా సంస్దాగతమైన ఆలోచనలు,చర్చలు చేస్తూ కొత్త మార్పులుకు శ్రీకారం చుట్టడానికి సిద్దమవుతున్నారు.
ఒకప్పుటి రెమ్యునరేషన్ల పండుగ, ఓటీటీ డీల్స్ బోనాంజా, ఫైనాన్స్ల వర్షం… ఇప్పుడు తెలుగు పరిశ్రమని ఊపిరాడని స్థితికి చేర్చిందని అందరికి అర్దమవుతోంది. పెద్ద హీరోలు రెమ్యునరేషన్లు తారాస్థాయికి వెళ్లిపోయాయి, ఓటీటీ ప్లేయర్స్ ఖచ్చితమైన నిబంధనలతో అతి బలంగా ఆడుతున్నారు. దాంతో పెద్ద నిర్మాతలంతా ఒక మౌన యుద్ధం చేస్తున్నారు.
రెమ్యునరేషన్ కాదు, రెస్పాన్సిబిలిటీ కావాలి అంటున్న ఇండస్ట్రీ!
ఈ గందరగోళాన్ని ధైర్యంగా చెదరగొట్టే ప్రయత్నం అటు దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ వంటి వారు చేయటం మొదలెట్టారు. ముఖ్యంగా మైత్రీ వారు దూకుడుగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం రీసెంట్ గా మైత్రీ ఎదుర్కొన్న ఎదురుదెబ్బలే అని తెలుస్తోంది.
అత్యుత్తమ బడ్జెట్తో, స్టార్ క్యాస్టింగ్తో తెరకెక్కిన 'Good Bad Ugly', 'Robinhood', 'Jaat' లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిర్మాతల ఆశల్ని అనుకున్న స్దాయిలో ముందుకు తీసుకెళ్లలేదు.
ఇండస్ట్రీ చెప్పే అసలు సమస్య ఎక్కడంటే – రెమ్యునరేషన్లే బడ్జెట్ను తినేస్తున్నాయి. ఓ నిర్మాత డబ్బు పోస్తున్నాడు, కానీ సినిమాకి లాభమొస్తే – దాని ఫలితం పూర్తి స్థాయిలో హీరో/డైరెక్టర్ దగ్గరే ఆగిపోతుంది. ఇది బిజినెస్ లాజిక్స్కు వ్యతిరేకం.
మార్పు కావాలంటే, మోడల్ మారాలి.
ఇందుకే మైత్రీ వారు తీసుకున్న కీలక నిర్ణయం: “Don’t pay the star. Pay the success.”
ఇకపై 'ప్రాఫిట్ షేరింగ్ మోడల్'.
అంటే –
స్టార్ రెమ్యునరేషన్ కూడా , సినిమాకే పెట్టుబడి, లాభాల్లో వాటా.
కొత్త తరం సినిమాలకి ఇది తప్పనిసరి మార్గం:
ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ దగ్గర పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్లతో భారీ ప్రాజెక్టులు ఉంటే, ఇంకో వైపు యంగ్ హీరోలతోనూ మీడియం సినిమాలు లైన్లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ మీడియం సినిమా ప్రాజెక్టులపై ఇక నుండి రెమ్యునరేషన్ కంటే, షేర్ సిస్టమ్ ఉంటుంది.
పెద్ద సినిమాలపైనా అదే మోడల్ కన్సిడరేషన్లో ఉంది అంటున్నారు కాని ఎంతవరకూ ముందుకు వెళ్తుందో తెలియాల్సి ఉంది.
“ఖర్చులకు కొంత రెమ్యునరేషన్ తీసుకుని, సినిమాను ఫాస్ట్గా పూర్తి చేయాలి” అన్నది నిర్మాతల కండీషన్.
రెవిన్యూ షేరింగ్ గురించి ఇప్పటికే చాలా మంది బహిరంగంగానే చెబుతున్నారు:
దిల్ రాజు – స్టేజిపై నేరుగా ఈ విషయాన్ని చెప్తూ "లాభాలు వచ్చినప్పుడు అందరికీ అందాలి, నష్టానికి మాత్రం నిర్మాత ఒంటరిగా ఎందుకు షేర్ చేసుకోవాలి?" అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు.
రాజమౌళి వంటి లెజెండరీ దర్శకులు – ప్రాజెక్ట్ మీదే పెట్టుబడి పెట్టి, రెవిన్యూ షేర్ తీసుకుంటూ పనిచేస్తున్నారు.
ఇవే ఇప్పటి ఫిల్మ్ మేకింగ్లో అవసరమైన బిజినెస్ ప్రాక్టీసు.
“If your art is powerful, take the risk with the producer. Don’t just take the cheque and walk away.”
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర ఆర్ధిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ప్రధానంగా:
భారీ రెమ్యునరేషన్లు స్టార్ హీరోలు 60–70% బడ్జెట్ తినేస్తున్నారు
ఓటీటీ నియంత్రణ ప్రముఖ ప్లాట్ఫామ్లు డబ్బు పెట్టేందుకు వెనకాడుతున్నాయి
లేట్ ప్రొడక్షన్ టైమ్ వాయిదాలు -> ఖర్చుల పెరుగుదల
లాస్ వర్సెస్ గ్లామర్ రిటర్న్స్ కంటే ఖర్చులే ఎక్కువ
మైత్రీ ప్రొడక్షన్స్ స్టెప్ = ఇండస్ట్రీకి డైరక్ట్ మెసేజ్
“ఇక మనం నిర్మాతను కాపాడుకునే టైమ్కి వచ్చేశాం.” రెవిన్యూ షేర్ ద్వారా సక్సెస్ కోసం బాధ్యతను పంచుకోవాలి, కేవలం డబ్బుకోసం కాకుండా విజయం కోసం కలిసి పని చేయాలి – ఇదే సినిమా ఇండస్ట్రీకి నిలబడలాంటే తప్పనిసరి అయ్యే దిశ.
నటీనటులు మొదట తక్కువ పారితోషికం తీసుకోవాలి
సినిమా ఆర్ధికంగా హిట్ అయితే, లాభాల్లో వాటా పొందాలి
లేదంటే, తక్కువ బడ్జెట్లో, తక్కువ డేస్లో సినిమా పూర్తి చేయాల్సి ఉంటుంది
ఏదైమైనా తెలుగు పరిశ్రమ ప్రస్తుతం ఓ వాణిజ్య మార్గదశ మలుపులో ఉంది. నిర్మాతల భవిష్యత్తును బలపర్చేలా ప్రాఫిట్ షేరింగ్ మోడల్ అనేది ఒక సాహసోపేతమైన, కానీ స్థిరమైన అడుగు. దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ దాన్ని మొదలుపెట్టబోతున్నారు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే...
"ఇతర అన్ని నిర్మాణ సంస్థలు ఈ మార్గాన్ని అనుసరిస్తాయా?"