ఇరాన్ టీవీ స్టేషన్ ను పేల్చివేసిన ఇజ్రాయెల్

గాజా, లెబనాన్ తరహాలో ఇరాన్ ప్రజలకు సూచనలు, వెంటనే టెహ్రన్ ఖాళీ చేయాలని పిలుపునిచ్చిన ఐడీఎఫ్;

Update: 2025-06-17 06:29 GMT
టెహ్రన్ లో ఇజ్రాయెల్ దాడుల వల్ల అలుముకున్న పొగలుళ

పశ్చిమాసియా సంక్షోభం తారాస్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్- ఇరాన్ ఘర్షణలో ఇరు దేశాలు ‘తగ్గేదేలే’ అన్న తరహాలో దాడులు, ప్రతిదాడులు చేసుకుంటున్నాయి.

తాజాగా ఇజ్రాయెల్, ఇరాన్ స్టేట్ టెలివిజన్ కేంద్రాన్ని లైవ్ జరగుతుండగానే పేల్చివేసింది. ఈ సందర్భంగా లైవ్ ఇస్తున్న రిపోర్టర్ కెమెరా ముందు నుంచే పారిపోయాడు.

ఇరాన్, ఇజ్రాయెల్ పైకి మిస్సైల్లు ప్రయోగించిన వెంటనే, ఐడీఎఫ్ ప్రతీకార దాడులు చేపట్టింది. ఇందులో ఎనిమిది మంది ఇరానియన్లు చనిపోయారు.

యుద్దం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇరాన్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వెంటనే తమతో ఒప్పందం చేసుకుని యుద్దాన్ని విరమించుకోవాలని, ఆలస్యం చేయవద్దని సూచించారు.

జీ7 సమావేశం కోసం కెనడాకు చేరిన ఆయన ఈ సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధ పరిస్థితులు సమీక్షించేందుకు ఆయన అక్కడి నుంచి త్వరగా బయల్దేరారు.

ఇరాన్ గగనతలంపై పూర్తి నియంత్రణ సాధించాము
ఇరాన్ పై ఐడీఎఫ్ చేస్తున్న దాడులపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ స్పందించారు. తాము చేసిన దాడుల వల్ల ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం చాలా దూరం వెనక్కి వెళ్లిందని అన్నారు.
‘‘మేము ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేయట్లేదు’’ అన్నారు. కానీ మా దాడుల వలన ఇరాన్ ప్రభుత్వం కూలిపోయిన ఆశ్చర్యపోనక్కరలేదని చెప్పారు. ‘‘ఇరాన్ పాలకులు చాలా బలహీనంగా ఉన్నారు’’ అని నెతన్యాహూ విలేకరుల సమావేశంలో చెప్పారు.
తాను ప్రతిరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో టచ్ లో ఉంటున్నానని వివరించారు. టెహ్రన్ లోని అనేక ప్రాంతాలలో పేలుళ్ల చప్పుల్లు వినిపిస్తున్నాయని ఆయన అన్నారు.
ఐడీఎఫ్ హెచ్చరికలు..
రాజధాని టెహ్రాన్ లో ఉన్న సైనిక స్థావరాలకు దగ్గరలో ఉంటున్న ఇరాన్ ప్రజలు వెంటనే ఆ ప్రదేశాలను విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఐడీఎఫ్ హెచ్చరికలు జారీ చేసింది. చాలా మిలిటరీ స్థావరాలకు సివిలియన్ ముసుగులు తొడిగారని ఇజ్రాయెల్ ఆరోపించింది. టీవీ స్టేషన్ పై దాడి అనంతరం అది ఈ ప్రకటన జారీ చేసింది.
తాము టెహ్రన్ గగనతలంపై పూర్తి నియంత్రణ సాధించామని కూడా ఐడీఎఫ్ వెల్లడించింది. అనుకున్న సమయంలో నిర్ధేశించుకున్న లక్ష్యాలపై దాడులు చేశామని తెలిపింది. తమ యుద్ద విమానాలకు ఎటువంటి ప్రమాదం సంభవించకుండా దాడులు చేయగలమని చెప్పింది.
ఐడీఎఫ్ హెచ్చరికలు సెంట్రల్ టెహ్రాన్ లోని మూడు లక్షల మంది ప్రజలపై ప్రభావం చూపనుంది. ఇక్కడ కీలకమైన ఇరాన్ స్టేట్ టీవీ, పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి.
లెబనాన్, గాజాలో ఐడీఎఫ్ దాడులు చేయడానికి ముందు ఇలాంటి తరహా హెచ్చరికలే జారీ చేసింది. ఇజ్రాయెల్ టీవీ స్టేషన్ పై దాడి చేసిన తరువాత లైవ్ బ్రాడ్ కాస్ట్ నిలిపివేసినట్లు ఇరాన్ స్టేట్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
నాలుగు బాంబులు..
ఓ రిపోర్టర్ లైవ్ ఇస్తున్న సమయంలో బాంబుల శబ్ధం వినిపించింది. ‘‘స్టూడియో మొత్తం దుమ్ముతో నిండిపోయింది. నా మాతృభూమిపై బాంబుల మోత ప్రారంభం అయిన సమయంలో..’’ అని చెబుతున్న సమయంలో బాంబులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
రిపోర్టర్ వెనక ఉన్న గోడ కూలిపోయింది. వారు కెమెరా ముందు నుంచి పారిపోయారు. బ్రాడ్ కాస్టర్ వెంటనే రికార్డెడ్ ప్రొగ్రాం ప్రసారం చేశారు. తరువాత టీవీ స్టేషన్ పై నాలుగు బాంబు దాడులు జరిగినట్లు ప్రకటించింది.
ఈ దాడుల్లో తమ సహ ఉద్యోగులు కొంతమందికి గాయాలైనట్లు, లైవ్ ప్రొగ్రాం వేరే స్టూడియోకి మార్చినట్లు తరువాత యాంకర్ ఒకరు చెప్పారు.
Tags:    

Similar News