విజయంపై టిడిపి నేత సోమిరెడ్డి కామెంట్స్

ఆంధ్రలో కూటమి ఘన విజయం సాదించడంపై టీడీపీ నేత సోమిరెడ్డి స్పందించారు. ‘‘ఇది ప్రజల విజయం ప్రజలే టిడిపిని గెలిపించారు.. ప్రజలే ఎన్నికలు చేశారు. జగన్ పాలనలో జరిగిన అరాచకాలను ప్రజలు తట్టుకోలేకపోయారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అన్ని రంగాలను విస్మరించారు. టిడిపికి ఎప్పుడూ లేని విజయాన్ని ప్రజలు అందించారు. మాపై చాలా బాధ్యత ఉంది ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మంత్రి పదవి పై నేను ఆలోచించడం లేదు’’ అని వివరించారు.

Update: 2024-06-04 10:21 GMT

Linked news