టిడిపి ఏజెంట్ కు గుండెపోటు

ఏపీ ఎన్నికల కౌంటింగ్ వేళ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెగ్మెంట్, టిడిపి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు తరపున టిడిపి పార్టీ ఏజెంట్ రమేష్ గుండెపోటుకు గురి అయ్యారు. నరసరావుపేట జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. దీంతో వెంటనే ఆయనను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన స్థానంలో మరొక వ్యక్తికి ఏజెంట్గా అధికారులు అవకాశం కల్పించారు.

Update: 2024-06-04 04:42 GMT

Linked news